నేడు జగన్ యాత్ర సాగుతుందిలా.. | Sakshi
Sakshi News home page

నేడు జగన్ యాత్ర సాగుతుందిలా..

Published Mon, Jan 6 2014 3:16 AM

నేడు జగన్ యాత్ర సాగుతుందిలా.. - Sakshi

సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన మూడవ విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలో భాగంగా సోమవారం నాటి పర్యటన వివరాలను పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
     
 సోమవారం కురబలకోట మండలం అంగళ్లు నుంచి ప్రారంభం
     
 తట్టివారిపల్లె, గౌనివారిపల్లె, చేనేతనగర్, సర్కార్ తోపు, ఎలకపల్లె, అమ్మచెరువు మిట్ట, నీరుగట్టు వారిపల్లె మీదుగా గొల్లపల్లెల్లో రోడ్ షో
     
 గొల్లపల్లెలో కంచికొమ్మల వెంకటరామయ్య కుటుంబాన్ని ఓదారుస్తారు.
     
 తట్టివారిపల్లెలో విగ్రహాన్ని ఆవిష్కరించి, తురకపల్లె, ఆరోగ్యవరం, పోతబోలు క్రాస్, కొత్తవారిపల్లె క్రాస్, గుడిసెవారిపల్లె, సీటీఎం క్రాస్ వరకు రోడ్డుషో.
     
 సీటీఎం గంగపురంలో శనక్కాయల గుర్రప్ప కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడి నుంచి పూలవాండ్లపల్లె, కాశిరావు పేటలో రోడ్‌షోలో పాల్గొని, వాల్మీకిపురంలో బస చేస్తారు.
 

Advertisement
Advertisement