వైఎస్సార్‌ సీపీలోకి భారీగా చేరికలు | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 7 2018 12:19 PM

Jammu Peta 25 Families Joined In YSRCP - Sakshi

సాక్షి, విజయనగరం : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. 280వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత వల్లాపురం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలో గుర్ల మండలం జమ్ముపేట గ్రామానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌తో గ్రామస్థులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పాతికేళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఒక్క పథకంలో కూడా లబ్ది చేకూరలేదని వాపోయారు. తమ పొలాలకు రావాల్సిన తోటపల్లి కాల్వ నీళ్లను కూడా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ సీఎం అయితే తమ బాధలు తీరతాయంటూ గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి.

Advertisement
Advertisement