సాక్షి, కాకినాడ: జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఇప్పటి వరకు 19,600 మందికి ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి , వికలాంగులకు రూ.1500 వంతున పింఛన్లను పంపిణీ చేసినట్టు కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. జన్మభూమి-మావూరు కార్యక్రమాల వివరాలను మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో ఆమె వివరించారు. సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 9వేల వృద్ధాప్య పింఛన్లు, 6,465 వితంతు పింఛన్లు, 3,300 వికలాంగ పింఛన్లు, 796 చేనేత పింఛన్లు, 227 గీత కార్మికుల పింఛన్లను పంపిణీ చేశామన్నారు. జన్మభూమిలో 2,250 మొక్కలను నాటడంతో పాటు 137 ట్రీగార్డులను పంపిణీ చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు జన్మభూమి గ్రామ, వార్డు సభల ద్వారా ప్రజల నుంచి 16,525 ఫిర్యాదులు, విజ్ఞాపనలను స్వీకరించినట్టు చెప్పారు.
తొలి దశలో 73 సుజల ప్లాంట్లు
ఎన్టీఆర్ సుజల పథకం కింద జిల్లాలో తొలిదశలో 304 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటికీ ఇప్పటివరకు 73 నెలకొల్పగలిగామని కలెక్టర్ నీతూప్రసాద్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ పథకం అమలు పురోగతిపై జెడ్పీ చైర్మన్ నామన రాంబాబుతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాంట్ల ఏర్పాటులో రాష్ర్టంలో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇదే స్పూర్తితో లక్ష్యాన్నిమించి 700 నుంచి 800 ప్లాంట్లు ఏర్పాటు చేయగలమన్న విశ్వాసం వచ్చిందని చెప్పారు. ఆర్వో ప్లాంట్లు 1500 లీటర్లు వాడితే అందులో 700 లీటర్లుశుద్ధి చేసిన నీరు రాగా, మిగిలిన 800 లీటర్ల నీరు వృధాగా పోకుండా చెట్ల పెంపకానికి, గృహాల్లో ఇతర అవసరాల వినియోగానికి మళ్లించాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ శ శాంక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఆర్పీ నందారావు, ముఖ్యప్రణాళికాధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జన్మభూమి సభల్లో 19,600 పింఛన్ల పంపిణీ
Published Wed, Oct 8 2014 12:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement