టోక్యోలో పర్యటించిన చంద్రబాబు
* గురువారం ఢిల్లీకి సీఎం
* పలువురు కేంద్రమంత్రులతో భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఎన్ఈసీ సంస్థ అంగీకరించింది. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమక్షంలో ఎన్ఈసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మధ్య ఒప్పందం చేసుకుంది.
దీనిపై ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఎన్ఈసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ కొచిరో కొయిడే సంతకాలు చేశారు. సీఎం చంద్రబాబు, జపాన్ మంత్రి యెసుజే టకజీ సమక్షంలో సంతకాలు చేశారు. జపాన్లో భారత రాయబారి దీపాగోపాలన్ వాద్వా, ఎన్ఈసీ చైర్మన్ కౌరు యనో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు బృందం జపాన్ పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటుంది.
బాబు ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, హోం మంత్రి రాజ్నాథ్సింగ్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ల అపాయింట్మెంట్లు కోరారు. లభించిన పక్షంలో వారితో సమావేశమై రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. లేనిపక్షంలో ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వస్తారు.
జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి టకజీతో బుధవారం చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం రెండుగంటలపాటు టోక్యోలో పర్యటించారు. షింబషీ మెట్రో స్టేషన్ నుంచి షింటో యొసు స్టేషన్ వరకూ 29 నిమిషాల పాటు ఆయన రైలులో ప్రయాణించారు. అనంతరం 2020 ఒలింపిక్స్ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు.
* జేజీసీ కార్పొరేషన్ చైర్మన్ మసాయుకితో జరిగిన సమావేశంలో పెట్రో కెమికల్ కారిడార్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.
* సుమిటొమి మిత్సు బ్యాంకింగ్ కార్పొరేషన్తో చర్చల సందర్భంగా ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్, మోనో రైలుకు అయ్యే ఖర్చులో గల వ్యత్యాసాన్ని అధ్యయనం చేయాలనికోరారు.
*టోషిబా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై స్మార్ట్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా పనిచేయాలని కోరారు.
* హోండా కంపెనీ మోటార్ సైకిల్ ఆపరేషన్ సీవోవో షీంజీ ఆప్యమాతో భేటీ అయి ఏపీలో ఒక ప్లాంటును ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.
* జేఎఫ్ఈ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు తమ రాష్ర్టంలోని ఏడు నగరాల్లో వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేసే ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి టెండర్లలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.
జపాన్లో ఎన్ఈసీతో ఒప్పందం
Published Thu, Jul 9 2015 2:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement