ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల డిమాండ్
సాక్షి, కడప : పులివెందుల తాగునీటి అవసరాలకు కేటాయించిన నీటిని సైతం దౌర్జన్యంగా దారి మళ్లించిన వారిపై చర్యలు తీసుకోకుండా.. ఆ ఘటన స్థలి పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం నీచమైన చర్య అని ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ధ్వజమెత్తారు. వివేకాకు మద్దతుగా జెడ్పీ సమావేశాన్ని బహిష్కరించి బయటికి వచ్చిన అనంతరం జెడ్పీటీసీ సభ్యులు బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి, మరక శివకృష్ణారెడ్డి, వేముల ఎంపీపీ లింగాల ఉషారాణి మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ పులివెందుల తాగునీటి కోసం బృహత్తర కార్యక్రమం చేపట్టి...రూ. 55 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణం చేపట్టారన్నారు.
ప్రస్తుతం తుంగభద్ర రిజర్వాయర్ నుంచి వస్తున్న నీటిని కల్లూరు వద్ద జేసీ బ్రదర్స్, సింగనమల నాయకురాలు యామిని బాలలు అక్రమంగా గండ్లు పెట్టి తరలించుకుపోవడం దారుణం అన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పులివెందులకు నీళ్లు తెస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ సతీష్రెడ్డి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని.. నీరు రాకముందే ఇలా ఎవరైనా ర్యాలీలు నిర్వహిస్తారా అని వారు ప్రశ్నించారు.
పైగా నీరు తరలించుకు పోతున్న జేసీ బ్రదర్స్ కూడా సతీష్రెడ్డి బంధువులేనని, ఒకరు తెచ్చేది.. మరొకరు తీసుకుపోయేదిలా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ జెడ్పీటీసీలు గిడ్డంగి వారిపల్లె రవికుమార్రెడ్డి, వెంగముని యాదవ్, లక్ష్మినారాయణమ్మ, ఎంపీపీలు సుబ్బారెడ్డి, అనసూయమ్మ, కుళ్లాయమ్మ, జయసుధ, మునికుమారి తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ వద్ద ధర్నా.. మద్దతు తెలిపిన అఖిలపక్షం
కడపలోని జిల్లా పరిషత్ వద్ద పులివెందుల నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ధర్నా నిర్వహించారు. దౌర్జన్యంగా నీటిని తరలించుకుపోతున్నా అడ్డుకోని పోలీసులు వైఎస్ వివేకాను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. జేసీ బ్రదర్స్పై కేసు పెట్టాలని నినాదాలు చేస్తూ జెడ్పీ సమావేశహాలు బయట బైఠాయించారు. ధర్నాకు అఖిలపక్ష నేతలు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, కె.సురేష్బాబు, చంద్ర, నజీర్ అహ్మద్ తదితులు మద్దతు తెలిపారు.
జేసీ బ్రదర్స్పై క్రిమినల్ కేసులు పెట్టాలి
Published Wed, Apr 1 2015 2:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement