పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు
‘సుప్రీం’ను ఆశ్రయించేందుకు పిటిషనర్కు స్వేచ్ఛ
హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అందువల్ల ప్రస్తుతం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే సమయంలో జూన్ 2న రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు జేసీజే పోస్టులను భర్తీ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి పిటిషనర్కు స్వేచ్ఛ ఇస్తున్నట్లు అందులో పేర్కొంది. 97 జేసీజే పోస్టుల భర్తీ నిమిత్తం హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ న్యాయవాది జి.సంతోష్రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం విచారించింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, జూన్ 2న రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నాయని, ఈ సమయంలో పోస్టులు భర్తీ చేయడం సరికాదని నివేదించారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి అడ్డుతగులుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తాము ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టామని స్పష్టం చేశారు. జేసీజే పోస్టుల భర్తీ విషయంలో తమ పనిని చేసుకోనివ్వాలని, 58:42 నిష్పత్తిలో సీమాంధ్ర, తెలంగాణల మధ్య పోస్టుల కేటాయింపు ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఈ సమయంలో సత్యంరెడ్డి జోక్యం చేసుకుంటూ, జేసీజే పోస్టుల్లో సీమాంధ్రులు ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నారన్నారు. అయితే అవన్నీ ఇప్పుడు చెప్పొద్దని, తమ బాధ్యత తమకు తెలుసునని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చట్ట ప్రకారం పోస్టుల భర్తీ చేపట్టామని తెలిపారు. ఈ పిటిషన్ దాఖలు చేసే న్యాయపరమైన హక్కు పిటిషనర్కు లేదని చెప్పారు.
జేసీజే పోస్టుల భర్తీపై జోక్యం చేసుకోలేం
Published Wed, Apr 23 2014 3:31 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement