ముద్రగడ సాధించిందేమీ లేదు: జోగయ్య | Sakshi
Sakshi News home page

ముద్రగడ సాధించిందేమీ లేదు: జోగయ్య

Published Tue, Feb 9 2016 1:22 AM

ముద్రగడ సాధించిందేమీ లేదు: జోగయ్య

సాక్షి ప్రతినిధి, ఏలూరు: కాపు రిజర్వేషన్ల కోసం చేపట్టిన దీక్షను హఠాత్తుగా విరమించడం ద్వారా ముద్రగడ పద్మనాభం ఏం సాధించారని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ప్రశ్నించారు. సోమవారం జోగయ్య ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. ఆయనపై ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేయించుకోవడం తప్పించి.. ముద్రగడ దీక్షవల్ల కాపులకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను మంగళవారం పూర్తి వివరాలు మాట్లాడతానని జోగయ్య చెప్పారు.

Advertisement
Advertisement