పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లె మండలంలో కైగల్ జలపాతం వద్ద ఎత్తిపోతల పథకాన్ని చేపడతామని గతంలో కిరణ్కుమార్రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీ నెరవేరకుండానే పోయింది. అప్పట్లో ఈ ప్రాజెక్టు పనులు కేవలం ప్రతిపాదనలతోనే అటకెక్కాయి. గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కైగల్ ఎత్తిపోతలు తమకే సాధ్యం అంటూ గుప్పించిన హామీ ఉత్తుత్తి కోతలేనని తేలిపోయింది. ఫలితంగా ఏటా 60 ఎంసీఎఫ్టీ(మిలియన్ క్యూబిక్ ఫీట్)ల నీరు వృథాగా బంగాళాఖాతంలో చేరుతోంది. అసలే మెట్ట ప్రాంతమైన ఈ మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి.
ఈ మండలంలో 60కి పైగా చెరువులున్నాయి. ఇవి నిండి చాలా ఏళ్లైంది. ఇక్కడ కైగల్ నది మాత్రమే మండలవాసులకు దిక్కు. వర్షాకాలంలో నదిలో నీళ్లు ప్రవహిస్తే చుట్టు పక్కల ప్రాంతాల్లో బోర్లలో నీటి సామర్థ్యం ఉంటుంది. కర్ణాటక రాష్ర్టంలోని ముళబాగల్ ప్రాంతం నుంచి ఈ నది బెరైడ్డిపల్లె మండలం మీదుగా తమిళనాడు రాష్ట్రంలోని కౌండిన్య నదిలో కలసి, బంగాళాఖాతంలోకి లీనమవుతోంది.
రెడ్డెప్పరెడ్డి చొరవతో ప్రతిపాదనలు
కైగల్ దుముకురాళ్ల జలపాతం వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి, ఈ ప్రాంతవాసులను ఆదుకోవాలని స్థాని కులు దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి చొరవతో ఈ ప్రాజెక్టు పనులు తెరమీదికొచ్చాయి. స్థానిక నాయకులు ఎమ్మెల్సీ ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కలసి ఎత్తిపోతల పథకం గురించి వివరించారు. దీంతో ఆయన స్పందించి ఇక్కడ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారుల నివేదికలు, అంచనాలు సైతం సిద్ధమయ్యాయి.
దుముకురాళ్ల వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, అక్కడి నుంచి వృథా నీటిని బెరైడ్డిపల్లె, పలమనేరు మండలంలోని పెద్దచెరువులకు మళ్లించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆ తర్వాత ఈ ఎత్తిపోతల పథకం గురించి కిరణ్ సర్కార్ అంతటితోనే మరిచింది. దీంతో ఈ ప్రాంతవాసుల ఆశలు అడియాశలుగా మారాయి. ఫలితంగా ఈ నది నుంచి వర్షపు నీరు వృథాగా తమిళనాడు చేరుతోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోని కిరణ్పై ఈ ప్రాంతవాసులు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు.
ఇలా ఉండగా మొన్నటి శాసనసభ ఎన్నికల సందర్భంగా పలమనేరుకు ప్రచారనిమిత్తం విచ్చేసిన చంద్రబాబు సైతం బహిరంగసభలో ఎత్తిపోతల పథకాన్ని తప్పక చేపడుతామని హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు దీని గురించి పట్టించుకొన్నవారేలేదు. బడ్జెట్లో కేటాయింపులు పరిశీలిస్తే ఇక ఈ పథకం కొండెక్కినట్టేనని అర్థమవుతోంది. టీడీపీ ప్రభుత్వమైనా తమ గోడు విని పనులు చేపడుతుందోమోనని భావించిన ఈప్రాంత వాసులు ఆశలు గాల్లో కలిశాయి. ఇక తమ ఆశ అడియాసేనని రైతులు బాధపడుతున్నారు.
కైగల్ ఎత్తిపోతలు... ఉత్తుత్తి కోతలు
Published Mon, Mar 23 2015 2:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement