కర్నూలు(అర్బన్): కర్నూలు-కడప (కేసీ) కెనాల్ నీటిని నమ్ముకొని సాగు చేసిన పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. ముఖ్యంగా నందికొట్కూరు, ఆత్మకూరు నియోజకవర్గాల పరిధిలోని రైతులు ఈ నీటిని నమ్ముకొని పసుపు, మిర్చి పంటలను దాదాపు 40 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ పంటలు ఫిబ్రవరి నెలాఖరుకు చేతికొచ్చే అవకాశం వున్నా, అంతవరకు ఈ పంటలకు కేసీ ద్వారా నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు.
రాజోలిబండ డైవర్షన్ స్కీం దిగువ భాగం నుంచి విడుదలవుతున్న 450 క్యూసెక్కుల నీటితో పాటు సుంకేసులలోని నీటిని కలిపి మొత్తం 817 క్యూసెక్కుల నీటిని కేసీ కాలువకు వదులుతున్నారు. ఈ నీటి విడుదల మరో రెండు రోజులు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. అంటే ఆ తర్వాత పంటలకు నీరందే పరిస్థితి లేదన్నమాట. దీంతో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. అయితే గత డిసెంబర్ నెలాఖరు వరకు మాత్రమే ఆయకట్టుకు నీటిని అందించాల్సి వుందని సాగునీటిశాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం సాగు చేసిన పంటలు ఎండిపోకూడదనే ఉద్దేశంతోనే నీటిని విడుదల చేస్తున్నట్టు చెబుతున్నారు.
టీబీ డ్యామ్ నుంచి నీరు విడుదల కావాల్సిందే!
జిల్లాలోని ప్రజల తాగు, సాగు నీటి అవసరాలకు సంబంధించి టీబీ డ్యామ్ నుంచి జిల్లాకు 6.50 టీఎంసీల నీరు విడుదల కావాల్సి వుంది. ఈ నీటిలో ప్రస్తుతం 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని జిల్లా నీటి పారుదల శాఖ ఇంజనీర్లు ఒకటికి రెండు సార్లు లేఖలు రాసినా, నేటి వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.
మరో రెండు రోజుల్లో టీబీ డ్యామ్ నుంచి నీరు విడుదల కాకుంటే ప్రస్తుతం కేసీ కింద సాగులో వున్న పంటలన్నీ ఎండి పోయే ప్రమాదం వుంది. ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో వున్న 1.19 టీఎంసీల నీటిలో 0.19 టీఎంసీల నీటిని వాడుకున్నా, ఒక టీఎంసీ నీరు మాత్రం కర్నూలు నగర ప్రజలకు తాగునీరు అందించేందుకు నిల్వ చేయక తప్పని పరిస్థితి వుంది.
అంటే మిగిలిన 0.19 టీఎంసీల నీరు మాత్రమే సాగునీటి అవసరాలకు వాడుకునే అవకాశం ఉంది. ఈ నీరు కేవలం రెండు రోజులకే సరిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. టీబీ డ్యామ్ నుంచి 5 టీఎంసీల నీరు విడుదల కాకుంటే జిల్లా రైతులకు తీవ్ర నష్టం తప్పదన్నమాట. అయితే, ఈ నీటిపై అనంత నేతలు కన్నేయడం కలవరపాటుకు గురిచేస్తోంది.
జిల్లా నీటిపై ‘అనంత’ నేతల కన్ను...
టీబీ డ్యామ్ నుంచి జిల్లాకు రావాల్సిన నీటి వాటాపై అనంతపురం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కన్నేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి అనంతపురం జిల్లాకు మళ్లించుకునేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. వాస్తవానికి బచావత్ అవార్డు ప్రకారం జిల్లాకు న్యాయంగా 6.5 టీఎంసీల నీటి వాటా రావాల్సింది.
ఈ వాటా నీటిని అనంతపురం జిల్లాకు మళ్లించడం ఆ అవార్డు తీర్పునకు వ్యతిరేకం కూడా. అయినప్పటికీ అనంతపురం నేతల ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గే పరస్థితి కనిపిస్తోంది. ఇదే జరిగితే కేసీ కెనాల్ నీటిని నమ్ముకొని పంటలు వేసిన జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. కేసీకి నీరు బంద్ అయితే నందికొట్కూరు, ఆత్మకూరు నియోజకవర్గాలోని రైతులతో పాటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రైతులపై ఈ ప్రభావం తీవ్రంగా చూపనుంది.
కేసీ ఆయకట్టుకు నీరేది?
Published Sat, Jan 3 2015 1:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement