కేసీఆర్‌ మూర్ఖుడు: ప్రభుత్వ విప్‌ పద్మరాజు | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ మూర్ఖుడు:ప్రభుత్వ విప్‌ పద్మరాజు

Published Mon, Sep 30 2013 9:31 PM

kcr loses sense, says rudra raju padma raju

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మూర్ఖుడని ప్రభుత్వ విప్‌ రుద్రరాజు పద్మరాజు విమర్శించారు. తెలంగాణ ప్రజలే ఆయనపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలంతా దొంగలేనంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘కేసీఆర్‌ నువ్వో మూర్ఖుడివి. పిచ్చివాడిలా మాట్లాడుతున్నావు. సీమాంధ్రోళ్లంతా దొంగలని తెలుగు ప్రజలను కించపరుస్తావా? ఎదుటి వారి మనసులను గాయపరచడమే రాజకీయమా? మతిస్థిమితం ఉండే మాట్లాడుతున్నావా? తెలంగాణ ప్రజలు నీపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’అని హెచ్చరించారు.

Advertisement
Advertisement