మునిపల్లి, న్యూస్లైన్:
డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజక వర్గంలోని మునిపల్లి మండలంలో కీలకమైన శాఖలకు రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. ఏళ్లతరబడి ఇన్చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు సాఫీగా సాగక మండల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఎంపీడీఓ సరోజిని రెండు నెలల క్రితం రిటైర్డ్ కావడంతో అప్పటి నుంచి రాయికోడ్ ఎంపీడీఓ వామన్రావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈయన సోమ, శుక్రవారాలు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటున్నా రు. మిగతా రోజుల్లో రాకపోవడంతో ఆయన చాంబర్ మూసి ఉంటుంది. పంచాయతీ రాజ్ ఏఈ మాణయ్య ఉద్యోగ విరమణ చేయడంతో ఈ పోస్టు మూడు నెలలుగా ఖాళీగా ఉంది. ఈఓపీఆర్డీ గంగాధర్ ఎనిమిది నెలల క్రితం బదిలీ కాగా ఇప్పటివరకు ఆయన స్థానం భర్తీ కాలేదు. ఎంఈఓ చంద్రమౌళి తొమ్మిది నెలల క్రితం ఉద్యోగ విరమణ గావించడంతో ఓ హెచ్ఎంకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. మునిపల్లి పీహెచ్సీలో పనిచేసే డాక్టర్ పూజ సుమారు తొమ్మిది నెలల క్రితం నిజామాబాద్ కు బదిలీ అయ్యారు. అప్పటినుంచి న్యాల్కల్ డాక్టర్ ప్రవీణ్కుమార్ ఇక్కడి బాధ్యతలను అదనంగా నిర్వర్తిస్తున్నారు. 25 పంచాయతీలకు గాను కార్యదర్శులు ఇద్దరు మాత్రమే ఉన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో టైపిస్ట్, ఆఫీస్ సబార్టినేట్, వాచ్మన్ పోస్టులు కూడా ఏళ్లతరబడి ఖాళీగానే ఉన్నాయి. కీలక శాఖల్లో ఇన్చార్జి అధికారులు ఉండడంతో వారు పని ఒత్తిడికి లోనవుతున్నారు. సదరు అధికారులు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిప్యూటీ సీఎం రాజనర్సింహతోపాటు ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ అధికారులను నియమించాలని వారు కోరుతున్నారు.
డిప్యూటీ సీఎం ఇలాకాలో..కీలక పోస్టులు ఖాళీ!
Published Sun, Nov 10 2013 1:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement