హైదరాబాద్లో చోరీకి గురైన కారు కేసు మలుపులు తిరుగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి కుమారుడు కావడంతో అందరి దృష్టి ఒక్కసారిగా జిల్లాపై పడింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్కు చెందిన ఎన్వీవీ ప్రసాద్ స్కోడా కంపెనీకి చెందిన సూపర్బ్ కారును గతేడాది మే 22న దస్పల్లా హోటల్ వద్ద పార్క్ చేసిన గంటలోపే మాయమైంది. పలు ప్రాంతాల్లో వెతికిన బాధితుడు మరునాడు జూబ్లీహిల్స్ పీఎస్లో ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినా సరైన ఆధారాలు లభ్యం కాకపోపోవడంతో కేసును సీసీఎస్కు బదిలీ చేశారు. ఈ కేసును విచారిస్తున్న క్రమంలో హోటల్ సీసీ కెమెరాలను పరిశీలించి పలువురు అనుమానితులను విచారించారు. దీనిలో జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఓ పోలీస్ అధికారి కుమారుడు ‘ఆర్ ’ అక్షరంతో పేరుగల వ్యక్తితోపాటు అతడి ముగ్గురు మిత్రులు ఉన్నారు.
మొదట ఎలాంటి ఆధారాలు లభ్యంకాకపోవడంతో అప్పుడు వదిలివేశారు. అయితే కేసును విచారిస్తున్న క్రమంలో కిరణ్ అనే వ్యక్తి అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించిన సమయంలో ఈ విలువైన కారు విషయం బయటకు వచ్చింది. దీంతో మళ్లీ సీసీ కెమెరాలతోపాటు బయట ఉన్న మరిన్ని పుటేజీలు పరిశీలించిన సమయంలో జిల్లాకు చెందిన పోలీస్ అధికారి కుమారుడే ఈ కారును చోరీచేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యంకాగా.. వారిని మళ్లీ పిలిపించి వారి పద్ధతిలోనే విచారించారు.
దీంతో కారు చోరీ చేయడంతోపాటు అమ్మగా వచ్చిన డబ్బులు జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నారని సమాచారం. ప్రస్తుతం నలుగురిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ప్రస్తుతం ఆ కారు జిల్లాలోనే ఉందని తెలియడంతో కరీంనగర్లో దాని ఆచూకీ కోసం వేట ప్రారంభించారు. ఈ సమయంలోనే జిల్లాలోని పోలీస్ అధికారి కుమారుడి హస్తం ఉన్నట్లు బయటకు పొక్కింది. గతంలో జిల్లాలో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేస్తున్న ఓ అధికారి కృషితోనే సదరు అధికారి కుమారుడు చిక్కినట్లు ప్రచారం జరుగుతోంది. కారు రికవరీ కాగానే నేడోరేపో వారిని అరెస్టు చూపే అవకాశాలున్నాయని తెలిసింది.
మలుపుతిరుగుతున్న'పోలీసు అబ్బాయి' కారు కేసు
Published Sun, Mar 9 2014 9:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement