సాక్షి, నెల్లూరు: అభివృద్ధి చెందుతున్న నెల్లూరులో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను సహించేది లేదని, నిబంధనలను ఉల్లంఘించిన వారు ఎంతటివారైనా రాజకీయాలకతీతంగా చర్యలు తప్పవని మేయర్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. రమేష్రెడ్డినగర్లో రవీంద్రభారతి విద్యాసంస్థ నిర్వాహకులు ఆక్రమించిన కార్పొరేషన్ పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్కూలు యాజమాన్యం అక్రమంగా నిర్మించిన ప్రహరీని మేయర్ దగ్గరుండి కూల్చివేయించారు. ఎవరు అక్రమనిర్మాణాలు చేపట్టినా ఇదే గతిపడుతుందని సంకేతాలిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రమేష్రెడ్డినగర్లో 89 సెంట్ల స్థలాన్ని కార్పొరేషన్ పార్కుకు కేటాయించింది. పార్కు నిర్మించకపోవడంతో పక్కనే ఉన్న స్కూల్ యాజమాన్యం ఆ స్థలంలో కొంత ఆక్రమించి ప్రహరీ నిర్మించింది.
మిగిలిన స్థలాన్ని తమ స్కూలు బస్సుల పార్కింగ్ స్థలంగా వినియోగించుకుంటోంది. దీని పై గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినా కార్పొరేషన్ అధికారుల నుంచి స్పందన కరువైంది. వైఎస్సార్సీపీ నేత అబ్దుల్ అజీజ్ మేయర్ కావడంతో ఆక్రమణల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అజీజ్ ఆదివారం ఉదయం ఆరు గంటలకే కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి అధికారులందరినీ పిలిపించారు. అక్కడ అధికారులతో చర్చించిన అనంతరం వారితో కలిసి నేరుగా రమేష్రెడ్డి నగర్కు చేరుకున్నారు. ఆక్రమిత స్థలంలో నిర్మించిన ప్రహరీని కూల్చివేసి స్థలాన్ని స్వాదీనం చేసుకున్నారు. ఈ ప్రక్రియను మేయర్ అబ్దుల్ అజీజ్ పర్యవేక్షించారు.
ఆక్రమణలు సహించం:
నగరంలో ఆక్రమణలు సహించేది లేదని మేయర్ అబ్దుల్ అజీజ్ తేల్చి చెప్పారు. ఆక్రమణలు, అక్రమకట్టడాలు కొనసాగిస్తే నెల్లూరు అభివృద్ధి ఆగిపోతుందన్నారు. స్మార్ట్సిటీ లక్ష్యం నెరవేరదన్నారు.
ఆక్రమించిన స్థలంలో నుంచి వైదొలగాలని స్కూలు యాజమాన్యానికి గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్నారు. ఈ స్థలంలో అందమైన పార్కు నిర్మిస్తామని చెప్పారు. కార్పొరేషన్ స్థలాలను కబ్జా చేసిన వారు తక్షణమే వాటిని వదిలిపెట్టాలన్నారు. లేకపోతే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అందరూ సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మేయర్ సహకారంతో కార్పొరేషన్ స్వాధీనం చేసుకున్న స్థలంలో సుందరమైన పార్కు నిర్మాణానికి అందరం సహకరిస్తామని స్థానిక కార్పొరేటర్ రాజేష్ తెలిపారు.
ఆక్రమణలపై ఉక్కుపాదం
Published Mon, Jul 28 2014 2:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement