కర్నూలు, న్యూస్లైన్:
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత నారాచంద్రబాబు నాయుడు సమైక్య ద్రోహులని వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గం సమన్వయకర్త ఎస్వీ మోహన్రెడ్డి విమర్శించారు. వారిని రాళ్లతో కొట్టి తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. సభ అనుమతి లేకుండానే టీ-బిల్లు చర్చకు అనుమతించడంపై నిరసిస్తూ సోమవారం రాత్రి శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఎస్వీ మాట్లాడుతూ అసెంబ్లీకి బిల్లు వస్తే దాని సంగతి తేలుస్తామని బీరాలు పలికిన సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోహం చాటేశారని విమర్శించారు.
కిరణ్కుమార్ రెడ్డి అధిష్టానం చెప్పినట్లుగా నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. సమైక్య తీర్మానానికి వైఎస్సార్సీపీ నాలుగు నెలలుగా పట్టుబడుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. పార్లమెంటుకు వెళ్లకుండా బిల్లును అడ్డుకుంటానని చెప్పి ఇప్పుడు మొహం చాటేయడం సిగ్గు చేటని విమర్శించారు. టేబుల్ ఐటమ్గా సభ దృష్టికి తీసుకొచ్చి టీ-బిల్లును ఆమోదించేందుకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు జిల్లా పర్యటనలకు వస్తే ఎక్కడి వారిని అక్కడే అడ్డుకుని చీపుర్లతో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ర్టం సమైక్యంగా ఉండేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఇందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ స్థాయిలో నాయకుల మద్దతు కూడగడుతున్నారని తెలిపారు.
వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునీర్ అహ్మద్, నగర కన్వీనర్ షరీఫ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తెర్నేకల్ సురేందర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ తోటా వెంకటక్రిష్ణారెడ్డి, పులి జాకోబ్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కిషన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, యువజన విభాగం నగర కన్వీనర్ రాజా విష్ణువర్ధన్రెడ్డి, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సిటీ కన్వీనర్ రాఘవేంద్ర నాయుడు, మహేష్ గౌడ్, సహదేవుడు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు బీజాన్బీ, మద్దమ్మ, శాంతమ్మ, కాంతమ్మ పాల్గొన్నారు.
కిరణ్, బాబు సమైక్య ద్రోహులు
Published Tue, Dec 17 2013 4:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రచార హోరు
అన్ని కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ఉండాలి
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement