చిత్తూరు జిల్లాలో నేడు సీఎం కిరణ్ పర్యటన | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో నేడు సీఎం కిరణ్ పర్యటన

Published Sat, Sep 28 2013 8:04 AM

చిత్తూరు జిల్లాలో నేడు సీఎం కిరణ్ పర్యటన - Sakshi

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు సొంత జిల్లా చిత్తూరు రానున్నారు. రాష్ట్ర విభజన గురించి కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు ప్రకటన చేసిన చాలాకాలం తర్వాత శుక్రవారం నాడు సుదీర్ఘ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. శనివారం మధ్యాహ్నం సొంత జిల్లాకు రానున్నారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేరుకుంటారు. తర్వాత రెండు గంటల పాటు అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తారు. అనంతరం ఆయన తన సొంత గ్రామం నగిరిపల్లికి వెళ్తారు. రాత్రికి ఆయన కలికిరిలోనే బస చేస్తారు.

Advertisement
Advertisement