సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఎన్.కిరణ్కుమార్రెడ్డి సోమవా రం రాత్రి (ఈనెల 24న) గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు పంపిన లేఖలో కోరారు. ఈ లేఖను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ‘రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 19న సీఎం పదవికి రాజీనామా చేశాను. తక్షణమే ఆమోదించాలని మిమ్మల్ని కోరా. రెండ్రోజుల తరువాత (ఈనెల 21న) నా రాజీనామా ను మీరు ఆమోదిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు.
అయితే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా నేను సీఎం పదవికి రాజీనామా చేశా. నా శాసనసభ్యత్వానికీ రాజీనామా చేసినందున సీఎంగా కొనసాగడం నాకు సక్రమంగా అన్పించడం లేదు. అందువల్ల ఆపద్ధర్మ సీఎం బాధ్యతల నుంచి నన్ను తక్షణమే విముక్తిడిని చేయాలని కోరుతున్నా..’ అని లేఖలో పేర్కొన్నారు.