సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన తీర్మానం రాష్ట్ర శాసనసభకు వస్తుందంటూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఇంకా సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. శాసనసభలో తీర్మానం అవసరం లేదనుకొనే కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్కు ఆమోదం తెలిపిందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, పొలిట్బ్యూరో సభ్యుడు బి. వినోద్కుమార్ అన్నారు. పార్టీ నేతలతో కలిసి మంగళవారం తెలంగాణభవన్లో వారు విలేకరులతో మాట్లాడారు.
ఏన్డీయే ప్రభుత్వం గతంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను విభజించి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సమయంలో.. ముందు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో విభజనకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసిన తర్వాతే అందుకు సంబంధించిన కేబినెట్ నోట్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పు డు మన రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి కేబినెట్ నోట్పై నిర్ణ యం జరిగిపోయిందన్నారు. అయినా అసెంబ్లీకి తీర్మానం వస్తుం దంటూ ముఖ్యమంత్రి చెప్పడాన్ని వారు తప్పుపట్టారు. ఆ ప్రక్రియ అధిగమించాకే కేబినెట్ నోట్ నిర్ణయం జరిగిందన్నారు. కేంద్రం ఏర్పా టు చేసిన మంత్రుల బృందం విభజన పె పాథమిక నివేదిక రూపొందించి తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపుతారని, అనంతరం ఆయన అభిప్రాయాలను మాత్రమే తెలుసుకుంటారన్నారు.
దానికి సంబంధించి ఎలాంటి ఓటింగ్ ఉండే అవకాశమే లేదని స్పష్టంచేశారు. ఈ మాత్రం అవగాహన లేని పరిస్థితిలో కిరణ్, చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ తీర్మానానికి సంబంధించి దిగ్విజయ్సింగ్ కొంత గందరగోళపరిచేలా వ్యాఖ్యలు చేశారని తప్పుపట్టారు. గతంలో ఉమ్మడి పంజాబ్ను విభజించినప్పుడు కేవలం సీడబ్లూసీ తీర్మానం చేశారని, ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కోరకుండానే విభజన ప్రక్రియ పూర్తి చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కిరణ్ మాదిరే ఆ సమయంలో అప్పటి పంజాబ్ సీఎం విభజనను వ్యతిరేకిస్తే రాష్ట్రపతి పాలన విధించారన్నారు. పంజాబ్ విభజన ప్రక్రియపై ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటి రాష్ట్రపతి రాజ్యాంగంలో రాష్ట్రాల విభజన ఆర్టికల్లో కొంత భాగాన్ని సస్పెండ్ ఉంచుతున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారంంటూ.. అందుకు సంబంధించిన కాపీని మీడియాకు చూపించారు.
తీర్మానం పేరుతో మోసం: టీఆర్ఎస్
Published Wed, Oct 9 2013 4:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement