కలెక్టర్ కిషన్‌కు పదోన్నతి | Sakshi
Sakshi News home page

కలెక్టర్ కిషన్‌కు పదోన్నతి

Published Tue, Feb 4 2014 1:38 AM

కలెక్టర్ కిషన్‌కు పదోన్నతి

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సెలక్షన్ గ్రేడ్ అధికారిగా కలెక్టర్ గంగాధర కిషన్‌కు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఇంతకాలం అడిషనల్ సెక్రటరీ హోదాలో ఉన్న కలెక్టర్ ప్రస్తుతం సెక్రటరీ హోదా పొందారు. ప్రభుత్వం జీఓ ఆర్టీ 441 ప్రకారం రాష్ట్రంలో 2001 బ్యాచ్‌కు చెందిన తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పించింది. కలెక్టర్ కిషన్‌తోపాటు జిల్లాలో గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన స్మితాసభర్వాల్, నీతూప్రసాద్, శ్రీనివాస్‌రాజు పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.
 

Advertisement
Advertisement