కృష్ణా బోర్డు సమావేశం 30కి వాయిదా | Sakshi
Sakshi News home page

కృష్ణా బోర్డు సమావేశం 30కి వాయిదా

Published Wed, Dec 24 2014 5:05 AM

Krishna River management Board meeting postponed to Dec 30

సాక్షి, హైదరాబాద్: ఈనెల 24న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్టు సమావేశం 30వ తేదీకి వాయిదా పడింది. బోర్డు చైర్మన్ ఎంఎస్ అగర్వాల్ చేస్తున్న క్షేత్రస్థాయి పర్యటనలు ముగియకపోవడం, సీలేరు విద్యుత్‌పై సదరల్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి ఇంకా నివేదిక అందకపోవడం తదితర కారణాలరీత్యా ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఎంఎస్ అగర్వాల్ మంగళవారం నాగార్జునసాగర్‌ను సందర్శించారు. రేడియల్ క్రస్ట్ గేట్లు ఎక్కి దిగువ కృష్ణానదిని పరిశీలించారు. డ్యాం మీదుగా వెళ్లి లిప్టుద్వారా 390,420 గ్యాలరీలలోకి దిగి పరిశీలించారు.

Advertisement
Advertisement