నంద్యాలటౌన్, న్యూస్లైన్: చెన్నైకి చెందిన సిఫీ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ జారీ చేసిన చెక్కులను మాయలేడి అజ్మిత్బేగం కాజేశారు. ఈమె తన ఖాతా ద్వారా దాదాపు రూ.20లక్షలు కాజేసి బ్యాంకుకే టోకరా వేసింది. సిఫీ టెక్నాలజీ కంపెనీ ఆన్లైన్లో ఈ డబ్బు డ్రా అయినట్లు గుర్తించడంతో మాయలేడి చేసిన ఘరానా మోసం వెలుగు చూసింది. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రోదశికుమార్ ఫిర్యాదు మేరకు వన్టౌన్ సీఐ గుమ్మడి రవికుమార్, ఎస్ఐ రమణ కేసు నమోదు చేశారు.
రోదశికుమార్ శుక్రవారం రాత్రి విలేకరులకు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. స్థానిక మూలసాగరానికి చెందిన అజ్మిత్బేగం పొదుపు మహిళ. ఈమె 2008లో శ్రీనివాస జంక్షన్లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో సేవింగ్స్ ఖాతా తెరిచింది. తర్వాత తరచూ డబ్బు డ్రా చేయడం, జమ చేయడం చేసేది. ఈ నేపథ్యంలో చెన్నైలోని సిఫీ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ అరుంధతిసింగ్ పేరిట రూ.800, టాటా టెలీ సర్వీస్ పేరిట రూ.561కు జారీ చేసిన చెక్కులను అజ్మిత్బేగం సంపాదించింది. సిఫీ టెక్నాలజీ కంపెనీ ఈనెల 24వ తేదీన రూ.9.76 లక్షలు, 27న రూ. 9.94లక్షల మొత్తానికి చెక్కులు అందించందంటూ 29వతేదీన తనఖాతాలో జమ చేసింది. ఆన్లైన్ విధానం కావడంతో దాదాపు రూ.20లక్షలు వెనువెంటనే ఆమె ఖాతాలో జమ అయ్యాయి. తర్వాత ఆమె ఈ డబ్బును డ్రా చేసుకొని వెళ్లిపోయింది. కాని తమ సంస్థ ఖాతాలో నుంచి రూ.20లక్షలు డ్రా కావడంతో సిఫీ టెక్నాలజీ కంపెనీ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రోదశికుమార్కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన చెక్కులను పరిశీలించి వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరా ద్వారా మాయలేడి గుర్తింపు..
మాయలేడి అజ్మిత్బేగం 29వ తేదీన ఉదయం 10గంటల సమయంలో మరో ఇద్దరు వ్యక్తులతో బ్యాంక్కు వచ్చినట్లు తర్వాత 11.30గంటలకు వెళ్లినట్లు బ్యాంక్ సీసీ కెమెరాలో నమోదైంది. అజ్మిద్బేగం తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి వారి సహాయంతో నకిలీ చెక్కులను అందజేసి డబ్బులను డ్రా చేసినట్లు తెలుస్తోంది.
చెక్కులు స్కాన్చేసి...
సిఫీ టెక్నాలజీ కంపెనీ జారీ చేసిన చెక్కులను చేజిక్కించుకున్న మాయలేడి అజ్మిత్బేగం, ఆమె సహచరులు కంప్యూటర్ టెక్నాలజీ సహాయంతో స్కానింగ్ చేసి తర్వాత చెక్కుల్లోని అమౌంట్లను మార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. తద్వారా కొత్త చెక్కులను ప్రింట్ తీసి బ్యాంక్లో జమ చేసి డబ్బు డ్రా చేసినట్లు తెలిసింది. అజ్మిత్బేగంపై చీటింగ్కేసు నమోదు చేశామని ఎస్ఐ రమణ తెలిపారు.
మాయలేడి ఘరానా మోసం
Published Sat, Aug 31 2013 4:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement