- బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
- ల్యాండ్పూలింగ్కు ఇచ్చిన భూ వివాదమే కారణం
అమరావతి: రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్కు ఇచ్చిన భూ వివాదం ఓ వివాహిత మృతికి కారణమయింది. భూమి పత్రాలు, దానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాల విషయంలో భర్త, సోదరుడి మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో మనోవేదనతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా అమరావతిలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. మంగళగిరి మండలం కురగల్లు గ్రామానికి చెందిన సామ్రాజ్యంతో అమరావతిలోని గోపాల్నగర్కు చెందిన బైనబోయిన వాసుకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడున్నాడు. వివాహ సమయంలో కట్నకానుకల కింద ఆమెకు పుట్టింటివారు రూ.30 వేల నగదు, 25 సెంట్ల వ్యవసాయ భూమి ఇస్తామన్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ల్యాండ్ పూలింగ్లో ఆ 25 సెంట్లను ప్రభుత్వానికి ఇచ్చారు. సామ్రాజ్యానికి తల్లిదండ్రులు లేకపోవటంతో కుటుంబ బాధ్యత వహిస్తున్న ఆమె సోదరుడు అడవి అంజయ్యను వాసు 25 సెంట్ల పొలం, దానికి సంబంధించిన ప్రభుత్వ ప్రయోజనాలను తనకు ఇవ్వాలని అడిగాడు. దీంతో వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో శుక్రవారం సామ్రాజ్యం తన కొడుకుని కొట్టడంతో ఆమెకు, అత్తకు వాగ్వాదం జరిగింది. దీంతో సామ్రాజ్యం సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి డీఎస్పీ మధుసూదనరావు, సీఐ హనుమంతరావు కేసు నమోదు చేశారు. మృతదేహనికి శనివారం పోస్టుమార్టం నిర్వహిస్తామని ఎస్ఐ వెంకటప్రసాద్ తెలిపారు.
ప్రాణం తీసిన ల్యాండ్ పూలింగ్
Published Sat, May 9 2015 2:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement