సిరులు పండే భూములు క్రమంగా చౌడు బారుతున్నాయి. పంట పొలాల్లో శ్రుతి మించుతున్న రసాయనిక ఎరువుల వినియోగం.. అధికమవుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా సారం కోల్పోతున్నాయి. పంట విరామం పాటించక పోవడంతో భూమిలో లవణాలు తగ్గిపోతున్నాయి. ఎరువుల మోతాదు మించడంతో నేలలో సూక్ష్మధాతు లోపం, జింక్ లోపం కనిపిస్తోంది. భూసార పరీక్షలు చేయించకపోవడం, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు సలహాలను రైతులు పాటించకపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా కనిపిస్తోంది.
తెనాలిటౌన్: కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో దశాబ్దంన్నర కాలంగా వరి తరువాత రెండో పైరుగా రైతులు మొక్కజొన్నను అధికంగా సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏడాదికి మూడు పంటలు పండిస్తున్నారు. రైతులు అవసరానికి మించి ఎరువులు ఉపయోగించడం వల్ల నేలలో సూక్ష్మధాతు లోపం, జింక్ లోపం కనిపిస్తోందని భూసార పరీక్షలు నిర్వహించిన శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్రామాల్లో వ్యవసాయాధికారులు అవగాహన సదస్సులు నిర్వహించి, రైతులను చైతన్య పరస్తున్నప్పటికీ రైతులు ఎరువుల వాడకం తగ్గించడం లేదు. వేసవి సీజన్లో పొలాల మట్టి నమూనాలు సేకరించి భూ సార పరీక్షలు చేయించి, ఫలితాల సిఫారసు మేరకు ఎరువులు వాడినట్లయితే మంచి దిగుబడులు వస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
సాగు వివరాలివీ.. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 93,750 ఎకరాల్లో గత ఏడాది ఖరీప్ సీజన్లో వరి సాగు చేశారు.
తెనాలి మండలంలో 22,500 ఎకరాలు, వేమూరు మండలంలో 22వేల ఎకరాలు, కొల్లూరులో 12,250 ఎకరాలు, దుగ్గిరాలలో 22,000 ఎకరాలు, కొల్లిపరలో 15,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. తెనాలి డివిజన్లో 1.45 లక్షల ఎకరాల్లో రబీ సీజన్లో మొక్కజొన్న సాగు చేశారు. తెనాలి సబ్ డివిజన్లో 62వేలు, రేపల్లె డివిజన్లో 25వేలు, పొన్నూరు డివిజన్లో 30వేలు, బాపట్ల డివిజన్లో 28 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు.
సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి.. వ్యవసాయ శాస్త్రవేత్తలు తెనాలి రూరల్ మండలంలోని గ్రామాల్లో 200 చోట్ల మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు జరిపారు. ఫలితాలను రైతులకు అందజేశారు. భూసార పరీక్షల ఫలితాల సిఫారసు మేరకు ఎరువుల వాడడం వల్ల రసాయనిక ఎరువుల మీద పెట్టుబడి తగ్గించవచ్చని వ్యవసాయాధికారి కె.అమలకుమారి తెలిపారు. నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను 4:2:1 నిష్పతిలో ఉపయోగించాలని సూచించారు.
నేలలో పోషకాల లోపం రాకుండా సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలని, కేవలం రసాయన ఎరువులే కాకుండా జీవన ఎరువులు, పశువుల ఎరువులు, పచ్చిరొట్ట, వర్మికంపోస్ట్ ఎరువులను వాడినట్లయితే భూసారం పెరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది భూ చేతన కార్యక్రమం కింద తెనాలి మండలంలోని సోమసుందపాలెం, కఠెవరం, కంచర్లపాలెం గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఆయా గ్రామాల్లో జింక్, జిప్సమ్, బోరాన్ ఎరువులను సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు.
భూములు నిస్సారం
Published Wed, Jun 18 2014 12:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement