సాక్షి, నిజామాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇందల్వాయి ఎఫ్ఆర్ఓ (ఫారెస్టు రేంజ్ అధికారి) రొడ్డ గంగయ్య హత్య కేసు దర్యాప్తులో ఓ అడుగు ముందుకు పడింది. కోర్టులో లొంగిపోయిన నిందితుడు సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఆ పార్టీ మహిళా నాయకురాలు జమునను పోలీసులు రెండురోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నిం చేందుకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలని జిల్లా రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు విజ్ఞప్తి చేయగా, కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. గత నెల 15న అటవీ భూ ఆక్రమణదారుల చేతుల్లో గంగయ్య దారుణ హత్యకు గురయ్యారు. పథకం ప్రకారం ఆయనను కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనను రాష్ట్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది.
ఈ ఘటనలో మొత్తం 36 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో 33 మందిని అరెస్టు చేసిన పోలీసులు పెద్ది వెంకట్రాములుతో పాటు, జమున పరారీలో ఉన్నారని ప్రకటించారు. ఎట్టకేలకు వీరిద్దరు నెల రోజుల అనంతరం ఈనెల 15న కోర్టులో లొంగిపోయారు. కోర్టు 15 రోజుల జుడీషియల్ కస్టడీకి ఆదేశించినట్లు వీరిని జిల్లా జైలుకు తరలించారు. సోమవా రం జిల్లా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నా రు.
ఇంకా ఈ కేసులో ట్రాక్టర్ డ్రైవర్ రాజు పరారీలోనే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాజు మినహా ఈ దారుణ ఘట నలో ప్రమేయం ఉన్న పాత్రదారులందరిని అరెస్టు చేసిన పోలీసులు.. సూత్ర దారులెవరో గుర్తించే పనిలో పడ్డారు. హత్యకు పథ క రచన చేసిందెవరో పరిశోధిస్తున్నారు. పెద్ది వెంకట్రాములు, జమునను అన్ని కోణాల్లో ప్రశ్నిస్తామని ఎస్పీ కేవీ మోహన్రావ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. వారి స్టేట్మెంట్ను రికార్డు చేస్తామన్నారు.
ఇంకా అందని పోస్టుమార్టం రిపోర్టు
గంగయ్య హత్య కేసుకు సంబంధించి వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం నివేదిక ఇంకా తమకు అందలేదని కేసు దర్యాప్తు అధికారి, నిజామాబాద్ డీఎస్పీ అనిల్కుమార్ తెలి పారు. మరణించిన గంగయ్యతో పాటు, స్వల్ప గాయాలపాలైన మరో ఆరుగురు అటవీశాఖ సిబ్బందికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక కూడా పోలీసులకు అందాల్సి ఉంది. హత్యకు వినియోగించిన గొడ్డలి, కర్ర తదితర ఆయుధాలను స్వాధీ నం చేసుకున్న పోలీసులు వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపారు.
పోలీసు కస్టడీకి సీపీఎం నేతలు
Published Tue, Oct 22 2013 6:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
విండీస్ క్రికెటర్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement