హుజూరాబాద్ టౌన్ : మండలంలోని సింగాపూర్ సమీపంలోని వరంగల్-కరీంనగర్ రాష్ట్ర రహదారి పక్కన ఆరు నెలల క్రితం ఓ వ్యక్తి వహత్యకు గురైన మిస్టరీ వీడింది. హుజూరాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు మృతుని చొక్కాపై ఉన్న లేబుల్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గా జిల్లాలోని జవత్తరలా వుండలంలోని బాలోడ్ గ్రామానికి చెందిన బీరేంద్రఠాకూర్(22)గా గుర్తించారు. పోలీసులు మొదటగా అనుమానించిన ట్లుగానే మృతునిది హత్యేనని పోస్టుమార్టం నివేదికలొచ్చాయి. ఈ కోణంలో పోలీసులు మృతుని ఆధారాల సేకరించగా మృతుడు లారీ క్లీనర్గా పనిచేసేవాడని టైలర్ షాపు నిర్వాహకుడు ఇచ్చిన ఆధారాల ప్రకారం పోలీసులు తెలుసుకున్నారు.
క్లీనర్ను హత్య చేసింది డ్రైవరే..
ఛత్తీస్గఢ్ రాష్టం నుంచి వరంగల్కు లారీలో డ్రైవర్ చున్నీలాల్తో కలిసి బీరేంద్రఠాకూర్ లోడ్ తీసుకవచ్చారు. వరంగల్లో లోడ్ తీసుకుని రాత్రి తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మార్గమధ్యలో ఓ చోట ఇద్దరు మద్యం తాగారు. ఈ క్రమంలో లారీని నడుపుతానని క్లీనర్ బీరేంద్రఠాకూర్ డ్రైవర్ చున్నీలాల్ను కోరాడు. ఈ విషయంలో ఇరువురి మద్య ఘర్షణ జరిగింది.
ఈ క్రమంలో డ్రైవర్ చున్నీలాల్ ఇనుపరాడ్తో బీరేంద్ర తలపై కొట్టాగ తీవ్ర రక్త స్రావమైంది. గమనించిన డ్రైవర్ చున్నీలాల్ క్లీనర్ మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మండలంలోని సింగాపూర్ గ్రామ శివారులోని రాష్ట్ర రహదారి పక్కన లారీ నుంచి క్లీనర్ బీరేంద్రఠాకూర్ మృత దేహన్ని కిందకు తోసి వెళ్లాడు. కరీంనగర్ నగర శివారుకు చేరుకున్న తర్వాత లారీలో పడ్డ రక్తం మరకలను తుడిచి నీటితో కడుక్కుని ఛత్తీస్గఢ్ వెళ్లాడు. అక్కడ క్లినర్ బీరేంద్ర ఏడని లారీ యజమాని ప్రశ్నిస్తే మరో లారీపై వెళ్లాడని బదులిచ్చాడు.
పోలీసుల అదుపులో నిందితుడు
సింగాపూర్ గ్రామ శివారులో జరిగిన లారీ క్లీనర్ హత్య కేసును ఛేదించడానికి సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై జగదీశ్ రెండు బృందాలుగా దర్యాప్తు ముమ్మరం చేశారు. క్రమంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సాలెగాంకు చెందిన డ్రైవర్ చున్నీలాల్ హత్య చేసినట్లుగా నిర్ధారించి నిందితుడిని హుజూరాబాద్కు తీసుకువచ్చారు. డ్రైవర్ చున్నీలాల్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
వీడిన హత్యకేసు మిస్టరీ
Published Mon, Dec 22 2014 2:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement