న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం | Sakshi
Sakshi News home page

న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం

Published Tue, Feb 25 2014 5:57 PM

మర్రి శశిధర్ రెడ్డి - Sakshi

ఢిల్లీ:  భద్రాచలంలో కొన్ని గ్రామాలు సీమాంధ్రలో కలపడంతో 3 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలలో న్యాయపరమైన సమస్యలు తలెత్తే  అవకాశం ఉందని జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. కేంద్రం ఈ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే లోక్‌సభ ఎన్నికల తర్వాతే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనసభ ఎన్నికలకు ముందే లోక్సభ  ఎన్నికలు జరుగుతాయనుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పునర్నిర్మాణం జరిగిన తర్వాత శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని శశిధర్‌రెడ్డి కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement