సాక్షి ప్రతినిధి, గుంటూరు: రుణమాఫీని బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ‘నరకాసుర వధ’ పేరిట పార్టీ శ్రేణులు చేపట్టిన ఆందోళనల్లో చివరి రోజు శనివారం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. రైతులు, డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని చంద్రబాబు అవకాశ వాదంపై దుమ్మెత్తిపోశారు.
‘రుణాలు కట్టకండి..అధికారంలోకి రాగానే మాఫీ చేస్తా’నన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత మాట మార్చి రూ.లక్షన్నర మేర మాత్రమే రుణమాఫీ అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం బ్యాంకర్లు రుణాలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలతో పాటు మారుమూల గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట కళామందిరం సెంటరులో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం జరిగింది. పోలీసులు ఆ ప్రయత్నాన్ని నిలువరించడంతో అక్కడే ధర్నా చేపట్టారు. ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దుగ్గిరాల మం డలం చుక్కావారిపాలెంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ధర్నా నిర్వహించారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో పట్టణంలోని గడియారం స్తంభం సెంటరులో ధర్నా జరిగింది. వెదుళ్లపల్లి గ్రామంలో ఐదు గ్రామాలకు చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాస్తారోకో నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డిల ఆధ్వర్యంలో కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు నిలువరించి, వారిని అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై ఎమ్మెల్యేను విడుదల చేశారు. తెనాలి నియోజకవర్గ ఇన్చార్జి అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో కొల్లూరు మండలంలో కార్యకర్తలు, నాయకులు ధర్నా చేశారు.వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో కొల్లూరు మండలంలో పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెదకూరపాడు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు దానిని నిలువరించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురంలో మాజీ ఎంపీపీ చుండూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెప్ప తగలేస్తారా?
Published Sun, Jul 27 2014 12:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement