ఫిరంగిపురం : వివాహేతర సంబంధం కొనసాగించేందుకు అంగీకరించని ఓ వివాహితపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన మండలంలో ఆదివారం సంభవించింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నారుు. ఫిరంగిపురం మండలం మునగపాడులో భర్తతో కాపురం ఉంటున్న ఓ మహిళ అదే గ్రామానికి చెందిన సయ్యద్ ఆదంషఫీతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న ఆమె భర్త గ్రామపెద్దలకు ఫిర్యాదు చేయగా వారు ఆమెను, ఆమెతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని మందలించారు.
మనసు మార్చుకున్న ఆమె షఫీతో సంబంధం కొనసాగించలేనని తేల్చిచెప్పింది. కానీ షఫీ మాత్రం ఆ మాట వినలేదు. పైగా ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆమె బాత్రూమ్కు వెళ్లేందుకు నిద్రలేవగా అప్పటికే కాపు కాసి వేచిచూస్తున్న ఆదం షఫీ వెంట బాటిల్తో తెచ్చుకున్న కిరోసిన్ ఆమె ఒంటిపై పోసి నిప్పంటించాడు.
ఆమె కేకలు వేయడంతో నిందితుడు పరారవ్వగా తుళ్లిపడి లేచిన భర్త మంటలను ఆర్పేసి, బంధువుల సాయంతో 108 వాహనం ద్వారా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ సీఐ యు.శోభన్బాబు, ఎస్ఐ పి.ఉద యబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
హత్యాయత్నానికి ఉపయోగించిన కిరోసిన్ బాటిల్, అగ్గిపెట్టె, మంటలు ఆర్పిన క్రమంలో కాలిన దుప్పటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లో విచారిస్తున్నారు. హత్యాయత్నం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఉదయబాబు తెలిపారు.
సూపరింటెండెంట్కు మహిళామోర్చా ఫిర్యాదు
విద్యానగర్(గుంటూరు): ఫిరంగిపురం మండలం మునగపాడులో జరిగన ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు జీజీహెచ్లో చికిత్సపొందుతోంది. బాధితురాలి శరీరం 60శాతం కాలిపోయిందని రెండు రోజులు గడిస్తేకాని చెప్పలేమని వైద్యులు తెలిపారు.
బాధితురాలిని భారతీయ జనతా మహిళామోర్చా నేతలు పరామర్శించారు. ఉదయం ఆరు గంటలకు ఆస్పత్రికి తీసుకువస్తే 10 గంటల వరకు వైద్యచికిత్స ప్రారంభించలేదని బంధువులు నేతల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మహిళానేతలు వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యడ్లపాటి స్వరూపరాణి వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు పరశరం రంగవల్లితో కలిసి జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఫిర్యాదుచేశారు. దీంతో వైద్యులు బాధితురాలికి చికిత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళానేతలు మాట్లాడుతూ మహిళపై దాడిచేసి నిప్పంటించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వివాహిత సజీవ దహనానికి యత్నం
Published Mon, Jan 5 2015 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement