కుమార్తె పెళ్లి ఆగిపోతుందనే భయంతో కుటుంబసభ్యులతో కలిసి దారుణం
డోన్టౌన్:
వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కుమార్తె పెళ్లి ఆగిపోతుందనే అనుమానంతో ప్రియుడిని ప్రియురాలే తన కుటుంబసభ్యులతో కలిసి పథకం ప్రకారం హత్యచేసింది. రైల్వే ఎస్ఐ ఏవీ నారాయణ కథనం మేరకు..ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామానికి చెందిన వెంకటమాధవక్రిష్ణారెడ్డి 13 ఏళ్ల క్రితం కర్నూలుకు చేరాడు.
ఆదోని రోడ్డులో ఉన్న డ్రైవర్స్ కాలనీలో నివాసముంటున్నాడు. వృత్తి రీత్యా లారీలు, ట్రాన్స్పోర్టు వ్యాపారం చేసేవాడు. ఇతనికి భార్య పావని, కుమారుడు యశంత్రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో సంతోష్ నగర్లో హోటల్ నడుపుతున్న లక్ష్మీకాంతమ్మతో పరిచయమైంది. ఈమె భర్తను విడిచి ఉండడంతో ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సమయంలో కుమార్తెకు పెళ్లి సంబంధం కుదిరింది. తన విషయం తెలిస్తే కుమార్తె వివాహం ఆగిపోతుందేమోనని ఆమె భావించింది.
ఎలాగైనా వెంకటమాధవక్రిష్ణారెడ్డి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. విషయూన్ని తన చెల్లెలు పెద్ద బీమక్కకు తెలిపింది. పథకంలో భాగంగా పెద్దబీమక్క అతనితో తరచూ మాట్లాడేది. ఈ నేపథ్యంలో మొహర్రం పండుగకు లింగనేనిదొడ్డి గ్రామానికి రావాలని పిలిచింది. దీంతో అతడు ఆదివారం అక్కడికి వచ్చాడు. అక్కడ లక్ష్మీకాంతమ్మ, ఆమె చెల్లెళ్లు పెద్దబీమక్క, చిన్నబీమక్క, మరిది నర్సింహులు, సోదరుడు రంగన్న కలిసి తాళ్లతో కట్టేసి హత్యచేశారు.
ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశారు. రైళ్లు అతడి శరీరంపై వెళ్లడంతో నుజ్జునుజ్జరుు గుర్తుపట్టలేని విధంగా తయూరైంది. సోమవారం రైల్వే పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి, శవాన్ని డోన్లోనే పూడ్చేశారు.
మిస్సింగ్ కేసు హత్యకేసుగా నమోదు..
వెంకట మాధవక్రిష్ణారెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆయన బావ తిమ్మారెడ్డి గత సోమవారం కర్నూలు 4వ పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో లక్ష్మికాంతమ్మ, ఆమె కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు వారిని విచారించడంతో హత్యవిషయం వెలుగుచూసింది. అనుమానాస్పద స్థితికేసు హత్యకేసుగా మారడంతో గురువారం రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
ప్రియుడిని చంపిన ప్రియురాలు
Published Thu, Nov 6 2014 3:09 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement