మట్టి ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

మట్టి ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి

Published Thu, Apr 30 2015 5:44 PM

man dies in freak accident

బెల్లంకొండ : గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం సమీపంలో మట్టి ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా కొట్టింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో గంగిరెడ్డిపాలేనికి చెందిన మోహన్(25) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement