కీసర, న్యూస్లైన్ : భార్యాపిల్లలను తీసుకొచ్చేందుకు అత్తవారింటికి వెళ్తున్న ఓ వ్యక్తి మార్గంమధ్యలో మృత్యువాత పడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న బైకును రివర్స్ తీసుకుంటున్న లారీ వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదంలో మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం కీసర ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం జలాల్పురం గ్రామానికి చెందిన జి. జనార్దన్గౌడ్ (45) కొన్ని ఏళ్ల క్రితం కీసర గ్రామానికి కుటుంబంతో వలస వచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం జనార్దన్గౌడ్ భార్యాపిల్లలను తీసుకురావడానికి తన మిత్రుడు రాముగౌడ్ తో కలిసి బైకుపై అత్తవారిల్లు కుందన్పల్లికి వెళ్తున్నాడు.
ఈక్రమంలో కుందన్పల్లి చౌరస్తా దాటి గ్రామంలోకి వెళ్తుండగా రోడ్డు పనుల్లో ఉన్న ఓ టిప్పర్ వేగంగా రివర్స్ వస్తూ ఈయన బైకును ఢీకొంది. ప్రమాదంలో జనార్దన్గౌడ్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆయన స్నేహితుడు రాముగౌడ్ రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపనుల్లో భాగంగా వాహనాల రాకపోకలు సూచించేందుకు సిబ్బందిని ఉంచాల్సి ఉన్నా కాంట్రాక్టర్ ఆదిశగా చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. జనార్దన్గౌడ్ రాకకోసం ఎదురు చూస్తున్న బంధువులు ఆయన మృతి వార్త విని నిర్ఘాంతపోయారు. భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి బంధువులు పెద్దమొత్తంలో చేరుకున్నారు. క్షతగాత్రుడు రాముగౌడ్ను చికిత్స నిమ్తితం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ కృష్ణకిషోర్ తెలిపారు.
అత్తవారింటికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు
Published Tue, Aug 6 2013 1:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement