ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Published Sat, Feb 20 2016 6:20 PM

man dies in rtc bus-scootter collision

ఓబులాపురం: వైఎస్సార్ జిల్లా ఓబులాపురం మండలం కొత్త మంగంపేట వద్ద శనివారం సాయంత్రం ఆర్టీసీ అద్దె బస్సు, స్కూటర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మంగంపేటకు చెందిన మురళి (30), రమేష్ స్కూటర్‌పై స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

గ్రామంలోకి వెళ్లేందుకు మలుపు తిరుగుతున్న సమయంలో వారి స్కూటర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మురళి మృతి చెందాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement