ఓబులవారిపల్లె(వైఎస్సార్ జిల్లా) : ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.20లక్షలు డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు అందకపోవడంతో అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఓబులవారిపల్లె మండలంలో ఆదివారం వెలుగు చూసింది. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు పట్టణానికి చెందిన సిరిపిరెడ్డి నాగసుబ్బారెడ్డి(55) అనే వ్యక్తికి అదే పట్టణానికి చెందిన ప్రసాద్, బాషా అనే ఇరువురు డ్రైవర్లతో పది రోజుల క్రితం ఓ మద్యం దుకాణం వద్ద పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం వారు నాగసుబ్బారెడ్డికి ఫోన్ చేసి రైల్వేకోడూరులోని లక్ష్మీప్యారడైజ్ వద్దకు రమ్మని కోరారు. అక్కడకు వెళ్లగానే ముందుగానే సిద్ధం చేసుకున్న ఓ కారులో రైల్వేకోడూరు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.
కిడ్నాప్కు గురైన నాగసుబ్బారెడ్డి ఫోన్నుంచే అతని కుమారుడు హర్షవర్దన్రెడ్డికి ఫోన్ చేసి మీ తండ్రిని కిడ్నాప్ చేశాం. రూ. 20 లక్షలు ఇస్తే వదిలేస్తామని డిమాండ్ చేశారు’. అంత పెద్ద మొత్తంలో వారు డబ్బులు సమకూర్చలేక పోయేసరికి పెట్రోల్ పోసి అతి కిరాతకంగా నాగసుబ్బారెడ్డిని హతమర్చారు. తమ తండ్రి ఆచూకీ తెలియకపోవడంతో అతని కుమారుడు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్ఫోన్ టవర్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు ఓబులవారిపల్లె - కష్ణపట్నం రైల్వేలైను పనులు జరుగుతున్న ఎల్లాయపల్లె సమీపంలో నాగసుబ్బారెడ్డిని కాల్చి చంపిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసం కిడ్నాప్ చేసి హతమార్చడం హేయమైన చర్య అని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఖండించారు.
డబ్బుల కోసం కిడ్నాప్, హత్య
Published Sun, Mar 22 2015 10:08 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement