తెనాలిలో వ్యక్తి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

తెనాలిలో వ్యక్తి దారుణ హత్య

Published Wed, Nov 25 2015 9:10 AM

man murdered in tenali

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక రైల్వే బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండగా బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. అతని ఒంటిపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి హత్య నేపథ్యంలో ప్రతీకారంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతిని వివరాలు, సంఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది. 

Advertisement
Advertisement