జీఎస్టీ అధికారుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

జీఎస్టీ అధికారుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

Published Tue, Oct 16 2018 10:25 AM

Man Suicide In Vijayawada For GST Fine - Sakshi

సాక్షి, కృష్ణా : విజయవాడలో సాదిక్‌ అనే వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆటోమొబైల్‌ టెక్నిషియన్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న సాదిక్‌ రెండు రోజుల క్రితం బందర్‌ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటోనగర్‌లో లారీలకు బాడీ బిల్డింగ్‌ వర్క్‌షాప్‌ నిర్వహిస్తు అతను జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల జీఎస్టీ అధికారుల నుంచి రూ.50 లక్షలు ఫైన్‌ కట్టాల్సిందిగా సాదిక్‌కు నోటీసులు పంపించారని.. వారి ఒత్తిడి వల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అంత డబ్బు కట్టలేక, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేకున్నారని వారు తెలిపారు. మంగళవారం ఉదయం ఘంటసాల సమీపంలోని కాల్వలో అతని మృతదేహం లభ్యమైంది.

Advertisement
Advertisement