పీఎస్లో వ్యక్తిని చితకబాదిన పోలీసులు | Sakshi
Sakshi News home page

పీఎస్లో వ్యక్తిని చితకబాదిన పోలీసులు

Published Sun, Nov 30 2014 9:07 AM

Man torched police in kovur police station in spsr nellore district

నెల్లూరు:  కేసు విచారణ కోసం పోలీసు స్టేషన్కు తీసుకువచ్చిన వ్యక్తిపై పోలీసులు లాఠీలతో తమ ప్రతాపాన్ని చూపారు. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. గాయపడిన వ్యక్తిని పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరు పోలీసుస్టేషన్లో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది.

అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కొవురు పట్టణంలో ఇటీవల చోరీ జరిగింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. విచారణ కోసం తీసుకువచ్చిన వ్యక్తిపై పోలీసులు తమ లాఠీలతో విచక్షణరహితంగా కొట్టారు. 

Advertisement
Advertisement