హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ)కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆరు కీలక జీఓలు జారీ చేసింది. ఈ బిల్లుపై గవర్నర్ నిన్న సంతకం చేశారు. ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తక్షణమే విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ(వీజీటీఎంయుడిఏ)ను రద్దు చేస్తూ ఒక జీఓను జారీ చేశారు. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. 122 కిలో మీటర్ల ప్రాంతం రాజధాని నగరంగా ప్రకటించారు. సీఆర్డీఏ పరిధిలోకి 7068 కిలోమీటర్ల ప్రాంతం వస్తుంది. దీని పరిధిలోకి 58 మండలాలు వస్తాయి. గుంటూరు జిల్లాలోని 29 మండలాలు, కృష్ణా జిల్లాలోని 29 మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.
సీఆర్డీఏ చైర్మన్గా ముఖ్యమంత్రి, వైఎస్ చైర్మన్గా మునిసిపల్ శాఖ మంత్రి, 9 మంది సభ్యులు ఉంటారు. రాజధాని ప్రాంత అధికారాలన్నీ సీఆర్డీఏ కార్యనిర్వాహక కమిటీకి బదలాయిస్తూ జీఓ జారీ చేశారు. ఈ ప్రాంతంలో ల్యాండ్పూలింగ్ అధికారాన్ని ఈ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్గా మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించారు. సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఆర్డీఏ కమిషనర్ ఉంటారు. మిగిలిన సభ్యుల వివరాలపై తరువాత ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
సీఆర్డీఏ పరిధిలోకి కృష్ణా జిల్లాలోని విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జి.కోండూరు, కంచికచర్ల, వీర్లుపాడు, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, నూజివీడు, పామిడిముక్కల, తోట్లవల్లూరు, పెదపారపూడి మండలాలు పూర్తిగా వస్తాయి. మొవ్వ, చల్లపల్లి, ఘంటశాల, పామర్రు, గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, మోపిదేవి మండలాల్లోని సగానికిపైగా గ్రామాలు వస్తాయి.
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు, పెదకూరపాడు, ముప్పాళ్ల మండలాలు పూర్తిగా వస్తాయి. భట్టిప్రోలు, పొన్నూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఎడ్లపాడు, నాదెండ్ల మండలాలలో సగానికిపైగా గ్రామాలు వస్తాయి. అచ్చంపేట, క్రోసూరు మండలాలలోని కొన్ని గ్రామాలు వస్తాయి.
సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే మండలాలు ఇవే
Published Tue, Dec 30 2014 8:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement