కొయ్యూరు, న్యూస్లైన్: విధులకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయుల వివరాలు మావోయిస్టులు సేకరిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని బడులకు ఉపాధ్యాయులు ఏ వేళకు ఎందరు వస్తున్నదీ ఆరా తీస్తున్నారు. నాలుగు రోజుల కిందట యు.చీడిపాలెం పంచాయతీ పలకజీడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వద్దకు దళసభ్యులు వచ్చారు. అక్కడివారితో కొద్దిసేపు మాట్లాడారు. గోడలపై కరపత్రాలు అంటించారు.
అనంతరం పాఠశాలలో ఎందరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నదీ, ఎందరు వేళకు వస్తున్నదీ, రోజుల తరబడి ఎవరు విధులకు డుమ్మాకొడుతున్నది తదితర విషయాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇద్ద రు పూర్తిగా రావడం లేదని గ్రామస్తులు వివరించినట్టు తెలిసింది. పలకజీడి మారుమూల ప్రాంతం కావడంతో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కాగా గ్రామానికి చెందిన అటవీ ఉద్యోగి ఒకరిని తమతో పాటు కొంత దూరం తీసుకెళ్లిన మావోయిస్టులు ఉద్యోగం మానేయాలని హెచ్చరించినట్టు తెలిసింది.
Breadcrumb
టీచర్ల పోకడపై మావోయిస్టుల ఆరా
Published Sat, Aug 24 2013 3:35 AM
Related news
-
Fact check: చదువులపై విషం కక్కిన నారా వారి కూలీ..
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల తరువాత గురువుకు ప్రత్యేక స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ సంస్కృతిని కొనసాగిస్తూ వారికి అత్యున్నత గౌరవం ఇస్తోంది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న గురివింద రామోజీకి ఇది మింగుడు పడలేదు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టింది.. వారిచేత మరుగుదొడ్లు ఊడ్పించిందని టీచర్లను అవమానించేలా కట్టుకథ అల్లేసింది. ఈ పనులు ఎక్కడ చేయించిందో మాత్రం ఆ పత్రిక రాయదు. గత ప్రభుత్వంలో పిల్లలకే కాదు.. టీచర్లకూ మరుగుదొడ్లు లేవన్న సత్యాన్ని మరుగున పరిచింది. ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి స్కూల్లో స్టాఫ్కు ప్రత్యేక, ఆధునిక సదుపాయాల కల్పన ఆ పత్రికకు కనబడవు. ఒకేసారి 25 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించింది ఈ ప్రభుత్వమే. నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ బడులు అద్భుతంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఉపాధ్యాయులకు ట్యాబ్లు, బోధనకు ఐఎఫ్పీ స్క్రీన్ల ఏర్పాటు జరిగాయి. వీటిని కావాలనే విస్మరించి ఆధారాలు లేని రాతలతో ఎల్లో మీడియా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాఠశాల అభివృద్ధిలో టీచర్లను భాగస్వామ్యం చేయడం తప్పేనా? ఒకప్పటి బ్లాక్ బోర్డుల స్థానంలో ఇప్పుడు డిజిటల్ బోధన సాగుతోంది. విద్యార్థులు నేర్చుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు 2019–20 విద్యా సంవత్సరంలో ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్, రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 44,512 స్కూళ్లను ఈ పథకం కిందకు తీసుకొచ్చింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగాయి. నాడు–నేడు మొదటి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలు, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలు బాగుపడ్డాయి. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందిస్తున్నారు. 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ రికార్డు. ఇవన్నీ పూర్తి పారదర్శకత కొనసాగేందుకు తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలకు ఏం అవసరమో వారే నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది. వీటిని తప్పంటోంది ఈనాడు పత్రిక. మీ రమాదేవి స్కూల్లో.. మీ నారాయణ స్కూళ్లల్లో ఇలాగే చేయిస్తున్నారా రామోజీ. జగన్ పాలనలో ► విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొత్త భవనాల నుంచి మరుగుదొడ్ల వరకు సమకూరాయి. ►గత నాలుగేళ్లలో అర్హత కలిగిన 25 వేల మంది టీచర్లు ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. ఇందులో నాలుగేళ్ల సర్వీసు ఉన్నవారికీ అవకాశం లభించింది. ►నాడు–నేడుతో ప్రతి బడిలోనూ 12 రకాల సదుపాయాలు. ►బోధనకు డిజిటల్ స్క్రీన్లు, స్మార్ట్ టీవీలు. ►బడుల్లోకి కొత్త ఫర్నిచర్. ►మన బడికి అంతర్జాతీయ కీర్తి. ►కోవిడ్ కష్ట కాలంలో నెలల తరబడి పాఠశాలలు మూతబడినా ప్రతి టీచర్కు ఠంచన్గా వేతనాలు. ►బడిలో పాఠాలు చెప్పడం, అభివృద్ధి పనులు పర్యవేక్షించడం తప్ప ఏ ఉపాధ్యాయుడికీ అదనపు పనులు అప్పగించలేదు. ►మరుగుదొడ్లను ప్రతిరోజు శుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది ఉన్నారు. వారికి ప్రతినెలా వేతనాలు చెల్లించేందుకు ‘టాయిలెట్ మెయింటనెన్స్ ఫండ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించే బాధ్యత స్థానిక ఉపాధ్యాయులు తీసుకున్నారు. చంద్రబాబు పాలనలో ► 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో చంద్రబాబు జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచారు. నూరు శాతం ఫలితాలు తేవాలని ఆదేశించారు. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో సాధ్యం కాదని ఆ ప్రధానోపాధ్యుడు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అంతే అదే వేదికపై ఆ హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ► 2003లో మంత్రిగా చేసిన నిమ్మల కిష్టప్ప గోరంట్లలో నిర్వహించిన జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్ను చెట్టుకు కట్టేసి కొట్టమని అనుచరులను రెచ్చగొట్టారు. ►మరుగుదొడ్లు లేక మహిళా టీచర్ల ఇబ్బందులు వర్ణనాతీతం. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆ అవసరం తీర్చుకునేవారు. ►జన్మభూమి సభ్యులే పేరెంట్స్ కమిటీల్లో చేరిపోయి పప్పు, బియ్యం ఎత్తుకెళితే అడిగినందుకు ఉపాధ్యాయులపై దౌర్జన్యాలు చేశారు. ►ఉపాధ్యాయులను నియమించకుండా నూరు శాతం ఫలితాలు తేవాలని ఒత్తిడి చేశారు. సాధ్యం కాదని చెబితే వెంటనే సస్పెండ్ చేసేవారు. ఈ రాతలు టీచర్లను అవమానించడమే గతంలో పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక ఉపాధ్యాయినులు పట్టణాలకే గాని మండల స్థాయి పాఠశాలలకు వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. బ్లాక్ బోర్డులౖపె రాసేందుకు సుద్దముక్క కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో పిల్లలకు, స్టాఫ్కు అన్ని సదుపాయాలు కల్పించింది కళ్లకు కనిపిస్తున్నాయి. తప్పుడు రాతలు రాసి టీచర్ల మనోభావాలను కించపరచడం దుర్మార్గం. ఉపాధ్యాయుల విధులు, సిబ్బంది విధులు ప్రత్యేకంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా ఏ టీచర్ కూడా మరుగుదొడ్లు కడిగింది లేదు. గతంలో ఎన్నికల విధులకు వెళ్లే ఉపాధ్యాయులు స్థానిక బడుల్లో ఉండలేక కష్టాలు పడేవారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పాఠశాలకైనా నిర్భయంగా వెళ్లే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. – గోపీకృష్ణ, ఉపాధ్యాయుడు (వైఎస్సార్టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) -
బదిలీ అధికారం యజమానికి ఉంది
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీ విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారిని బదిలీచేసే అధికారం సదరు యజమాని (ప్రభుత్వం)కి ఉందని స్పష్టంచేసింది. ఒప్పందంలో బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ప్రభుత్వం వారిని బదిలీ చేయడం తప్పుకాదని తేల్చిచెప్పింది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను బదిలీచేస్తూ 2022లో ప్రభుత్వం జారీచేసిన జీఓ–103ను హైకోర్టు సమర్ధించింది. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులు కనీస వేతన స్కేల్కు అర్హులని స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని వారందరికీ కనీస వేతన స్కేల్ను వర్తింపజేస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీచేసిందని.. అందులో కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నారని పేర్కొంది. సవరించిన కనీస వేతన స్కేల్ను కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 1–1–2022 నుంచి అమలుచేయాలని.. వారికి చెల్లించాల్సిన బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని అధికారులకు తేలి్చచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ కృపాసాగర్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు.. రాష్ట్ర ప్రభుత్వం తమకు కనీస వేతన స్కేల్ను ఖరారుచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను అమలుచేసేలా అధికారులను ఆదేశించడంతో పాటు, తమను వివిధ ప్రాంతాలకు బదిలీచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను చట్ట విరుద్దంగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లోని కాంట్రాక్టు టీచర్లు 2022లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు కాంట్రాక్టు టీచర్ల బదిలీల ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించారు. ఇదే సమయంలో కోర్టుకొచ్చిన టీచర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగించాలని.. అంతేకాక.. వారికి కనీస వేతనాలు, తదనుగుణ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పారు. బదిలీల విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ కాంట్రాక్టు టీచర్లు.. కనీస వేతనాలపై ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. బదిలీ అధికారం యజమానికి ఉంది ‘ఇక కాంట్రాక్టు టీచర్ల బదిలీ విషయానికొస్తే, వారిని కావాల్సిన చోటుకు బదిలీ చేయడం సబబే. నిజానికి.. 2013 నాటి కాంట్రాక్టు ఒప్పందంలో బదిలీల విషయంలో ఎలాంటి నిబంధన లేదు. దీని ఆధారంగా కాంట్రాక్టు టీచర్లు తమను బదిలీ చేయడానికి వీల్లేదంటున్నారు. అయితే, 2022లో తీసుకొచ్చిన కొత్త ఒప్పందంలో బదిలీ నిబంధన ఉంది. అందువల్ల ప్రస్తుత కేసులో కాంట్రాక్టు టీచర్ల బదిలీ ఉత్తర్వులను ఎంతమాత్రం తప్పుపట్టలేం. బదిలీల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు సమర్థనీయమే’.. అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంచేసింది. వారికిచ్చి వీరికివ్వకపోవడం వివక్షే.. వీటిపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కాంట్రాక్టు టీచర్ల తరఫు న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పు కాంట్రాక్టు, తాత్కాలిక, అడ్హాక్ తదితర ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలను వర్తింపజేస్తూ జీఓ ఇచ్చిందని, అయితే అధికారులు వాటిని కాంట్రాక్టు టీచర్లకు వర్తింపచేయడం లేదన్నారు. పిటిషనర్లు కాంట్రాక్టు టీచర్లు మాత్రమేనని, వారికి ట్రాన్స్ఫర్లు వర్తింపజేయడానికి వీల్లేదని తెలిపారు. కనీస వేతనాలు వర్తింపజేయకుండా బదిలీలు చేయడానికి వీల్లేదన్నారు. సర్వశిక్షాభియాన్ తరఫు న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపిస్తూ.. కేజీబీవీ, యూనివర్సిటీలు, సొసైటీలు, మోడల్ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కనీస వేతన స్కేల్ను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అయితే, ఈ ఉత్తర్వులు మంజూరు చేసిన ఖాళీల కింద నియమితులైన వారికి మాత్రమే వర్తిస్తాయన్నారు. అలాగే, బదిలీ చేయాలని పలువురు కాంట్రాక్టు టీచర్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమరి్పంచారని, ఆ మేరకు వారి బదిలీ జరిగిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కనీస వేతనాల విషయంలో ఎన్వీ సుమంత్ వాదనలతో ఏకీభవిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. అంతేకాక.. ‘తమకు కనీస వేతన స్కేల్ ఉత్తర్వులను వర్తింపజేయాలన్న కాంట్రాక్టు టీచర్ల అభ్యర్థన సబబైనదే. సమాన పనికి సమాన వేతనం చెల్లించకపోవడం అన్నది దోపిడీ, బానిసత్వం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకునే వారికి కనీస వేతన స్కేల్ను అమలుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అధికారులు ఆ స్కేల్ను వర్తింపజేయకపోవడం ఏకపక్షం. కనీస వేతనాల విషయంలో సింగిల్ జడ్జి తీర్పును ఏ రకంగానూ విమర్శించాల్సిన అవసరంలేదు’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
టెట్.. టఫ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసినవారితోనే టెట్ రాసేందుకు సర్విస్లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరుగుతోంది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించడంపై బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితోనే టెట్ రాయాలన్న నిబంధనను మాత్రం సర్వీస్లో ఉన్న టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. సర్విస్ టీచర్లు టెట్ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియపై విద్యాశాఖ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటి వరకూ టెట్ సిలబస్ను మాత్రమే ప్రకటించింది. సమగ్ర నోటిఫికేషన్ను విడుదల చేయలేదు. టెట్ దరఖాస్తులను ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకూ స్వీకరించాల్సి ఉంది. మే 20 నుంచి జూన్ 3 వరకూ టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. నిబంధనల్లో మార్పు తప్పదా? టెట్ మార్గదర్శకాలు వెలువడితే తప్ప దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. సమగ్ర నోటిఫికేషన్లో ఫీజు, పరీక్ష విధానం, రిజర్వేషన్లు ఇతర అంశాలన్నీ పేర్కొంటారు. దీనికి ముందు సర్విస్లో ఉన్న ఉపాధ్యాయులూ కొత్తవారితో కలిసి టెట్ రాసేందు కు వీలుగా జీఓ వెలువడాలి. ఈ అంశాన్ని మార్గదర్శకాల్లో చేర్చాలి. అయితే, ప్రారంభంలోనే ఉపాధ్యాయ సంఘాలు టెట్పై అభ్యంతరాలు లేవనెత్తు తున్నాయి. సిలబస్ విడుదలైన వెంటనే అధికారులను ఉపాధ్యాయ సంఘాలు కలిసి అభ్యంతరాలు తెలియజేశాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటారని, అన్ని సబ్జెక్టులతో కూడిన టెట్ రాయ డం అసాధ్యమంటున్నారు. భాషా పండితులకు వా రు చెప్పే లాంగ్వేజీలపై తప్ప మరే ఇతర సబ్జెక్టులపై పట్టు ఉండదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు తేలికగా టెట్ రాసే వీలుందని, కొన్నేళ్ల క్రితం ఈ కోర్సులు చేసిన టీచ ర్లు ఎలా రాస్తారనే వాదన లేవనెత్తుతున్నారు. దీని పై ప్రభుత్వం కూడా అధికారుల నుంచి వివరణ కోరింది. ఈ కారణంగానే టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతోందని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. టీచర్లను బలవంతంగా టెట్ రాసే జాబితాలో చేరిస్తే న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే టెట్ నిర్వహణకు బ్రేక్ పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు 80వేల మంది వరకూ ఉన్నారు. స్పెషల్ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్, ఎస్ఏల నుంచి హెచ్ఎంలకు పదోన్నతులు పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెట్ రాయాల్సిన అవసరం ఏర్పడింది. టెట్ తర్వాతే పదోన్నతులు చేపడతారు. పదోన్నతులు కల్పిస్తేనే ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేక టెట్ పెట్టి తీరాలి ప్రత్యేక టెట్ పెట్టకపోతే సర్వీస్లో ఉన్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా టెట్ ఫలితాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడో బీఈడీ, టీటీసీ చేసిన టీచర్లు ఇప్పుడు టెట్ రాస్తే పాసయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ప్రత్యేక సిలబస్తో టీచర్లకు టెట్ పెట్టాలి. భాషా పండితులకు కూడా ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండాలి. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అన్యాయం జరిగిందని భావిస్తే ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్షణమే గైడ్లైన్స్ ఇవ్వాలి షెడ్యూల్ ప్రకారం టెట్ గైడ్లైన్స్ విడుదల చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు. విధివిధానాలు వస్తే తప్ప నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. లక్షల మంది అభ్యర్థులు టెట్ సమగ్ర నోటిఫికేషన్కు ఎదురుచూస్తున్నారు. టెట్ సకాలంలో జరిగి, ఫలితాలు వెలువడినా, డీఎస్సీ రాయడానికి తక్కువ సమయమే ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – రావుల మనోహర్రెడ్డి తెలంగాణ బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్
మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ నిబంధన విధించింది. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టు, డిజైనర్, ప్రింటెడ్ దుస్తులు ధరించి స్కూలుకు రాకూడదు. ఈ విషయమై ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఉపాధ్యాయులు తమ వస్త్రధారణ విషయంలో హద్దులకు లోబడి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ధరించే ఆధునిక దుస్తులు విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆ నోటిఫికేషన్లో వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మహిళా ఉపాధ్యాయులు, పురుష ఉపాధ్యాయులకు వేర్వేరు రకాల డ్రెస్ కోడ్లు అమలు చేయనున్నారు. మహిళా ఉపాధ్యాయులు జీన్స్ , టీ-షర్టులు, ముదురు రంగులు, డిజైన్లు లేదా ప్రింట్లు ఉన్న దుస్తులను ధరించకూడదు. వారు కుర్తా దుపట్టా, సల్వార్, చురీదార్, లేదా చీర ధరించాలని తెలిపారు. పురుష ఉపాధ్యాయులు, షర్టు, ప్యాంటు ధరించాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. షర్టును ప్యాంట్లోకి టక్ ఇన్ చేయాలని సూచించారు. ఈ నిబంధనలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకే కాకుండా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాగా ఈ డ్రెస్ కోడ్పై పలువురు ఉపాధ్యాయులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఏమి ధరించాలి? ఏమి ధరించకూడదనేది వారి వ్యక్తిగత విషయమని, దానిపై వారికి ప్రత్యేక హక్కు ఉంటుందని వారంటున్నారు. ఉపాధ్యాయుల వస్త్రధారణ విద్యార్థులపై దుష్ప్రభావం చూపకూడదనే ఉద్దేశ్యంతోనే డ్రెస్కోడ్ను రూపొందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
కొలువుదీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా నియమితులైన టీచర్లు కొలువుదీరేందుకు మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్ట్రుగాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పిడీ), లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్) కేటగిరీల్లో దాదాపు 9వేల మంది కొత్తగా ఉద్యోగాలు సాధించారు. పీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ కేటగిరీల్లో ఎంపికైన దాదాపు 2 వేల మందికి గత నెలలో నియామక పత్రాలను సంబంధిత గురుకుల సొసైటీలు అందించాయి. అదేవిధంగా వారం క్రితం ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ కేటగిరీల్లో ఎంపికైన 5,193 మందికి నియామక పత్రాలు అందజేశారు. వాస్త వానికి ఈ మూడు కేటగిరీల్లో 6,600 మందికి నియామక పత్రాలు అందించాల్సి ఉండగా.. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. మరికొన్ని పోస్టులను సాంకేతిక సమస్యల కారణంగా పెండింగ్లో పెట్టారు. కాగా, కోడ్ తొలగిన వెంటనే పూర్తిస్థాయిలో నియామక పత్రాలు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. కానీ మరో నాలుగైదు రోజుల్లో పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. దీంతో లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు గురుకుల టీచర్లు కొలువెక్కేందుకు అవకాశం లేకుండా పోతుంది. సీనియారిటీ తారుమారు కాకుండా.. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారు 7 వేలకు పైగానే ఉన్నారు. నియామక పత్రాలు అందుకున్న వారికి నిర్దేశించి మల్టీ జోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టింగ్ ఇవ్వాలి. కానీ జిల్లా కేడర్ మినహా జోన్లు, మల్టీజోన్ కేడర్లకు చెందిన కేటగిరీల్లో పోస్టింగ్ ఇవ్వాలంటే ఆ పరిధిలోని ఉద్యోగులందరికీ ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించాలి. జిల్లాస్థాయి కేడర్లో పోస్టింగ్ ఇస్తే ఇతర ఉద్యోగులకు పోస్టింగ్ పరంగా ఇబ్బంది లేనప్పటికీ సీనియార్టీలో భారీ వ్యత్యాసం వస్తుంది. విధుల్లో చేరిన తేదీతో సర్వీసును పరిగణిస్తుండగా.. ఎన్నికల కోడ్ తర్వాత పోస్టింగ్ తీసుకున్న వారు జూనియర్లుగా పరిగణనలోకి వస్తారు. దీంతో భవిష్య త్తులో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సొసైటీలు పోస్టింగ్ ప్రక్రియను వాయిదా వేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెలాఖరు వరకు ఉంటుంది. అంతలోపే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా.. ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు నియామకపత్రాల అందజేతకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత నియామక పత్రాలు పంపిణీ చేసి, తర్వాత కొత్తగా ఎంపికైన ఉద్యోగులందరికీ ఒకే దఫా కౌన్సెలింగ్ నిర్వహించేలా సొసైటీలు కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత మెరిట్ ఆధారంగా ఎంపిక చేసుకున్న పోస్టులు దక్కేలా సొసైటీలు సాంకేతిక ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మే నెలాఖరు సమీపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత జూన్ నెల నుంచి 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో కొత్త విద్యా సంవత్సరంలోనే కొత్త టీచర్లు కొలువుదీరుతారని చెపుతున్నారు.
Related News by category
-
ఇదేందయ్యా.. భార్గవా?
సాక్షి, నంద్యాల: నంద్యాల పార్లమెంట్ స్థానానికి ఓ వ్యక్తి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం, ఉపసంహరించుకోవడం ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది. ఆయన ఎవరో కాదు ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ భర్త మద్దూరు భార్గవ రామ్ నాయుడు. టీడీపీ నుంచి నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్లలో చివరి రోజు ఈనెల 25వ తేదీ భార్గవ రామ్ చడీచప్పుడు కాకుండా నంద్యాల ఎంపీగా నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్లు తాను సమర్పించిన నామినేషన్ల పత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న శబరి.. అఖిలప్రియ వ్యవహారశైలిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు భరిస్తామని హామీ ఇస్తేనే భార్గవరామ్ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటారని.. లేని పక్షంలో ఇండిపెండెంట్గా బరిలో ఉంటామని అఖిల ప్రియ చెప్పినట్లు ప్రచారం సాగింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుండడంతో టీడీపీలో హైడ్రామా నడిచింది. భార్గవరామ్ తన నామినేషన్ విత్డ్రా చేసుకోకుంటే పార్టీ పరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామని అధిష్టానం నుంచి గట్టి హెచ్చరికలు చేయడంతో భార్గవ్ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ‘సార్.. ఏం ఆశించి నామినేషన్ వేశారో’ అన్న చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఈ తంతంగంపై బైరెడ్డి శబరి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
‘ఓ బోగస్ బాబూ.. ఈ జగన్లా ఏం చేశావు?’
ప్రకాశం, సాక్షి: నాయకుడంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలని.. ఒక మాట చెబితే కచ్చితంగా చేసి తీరతాడని ప్రజలు భావించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అయితే చంద్రబాబుకి ఓటేయడమంటే మళ్లీ మోసపోవడమేనని తేల్చి చెప్పారాయన. మంగళవారం ఒంగోలు పార్లమెంట్ స్థానం పరిధిలోని కొండేపి నియోజకవర్గం టంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపు. చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుంది. ఐదేళ్లపాటు ప్రజల రక్తం తాగుగుతుంది. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తులను నిర్ణయించేది.. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. .. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు. ఓటేసే ముందు ఎవరిది బోగస్ రిపోర్టు, ఎవరిది ప్రోగ్రెస్ రిపోర్టు అనేది చూడాలి. ప్రభుత్వ ఉద్యోగాల రిపోర్టు పరిశీలిస్తే.. జాబ్ రావాలంటే బాబు రావాలి అనే మాటలు గుర్తున్నాయా?. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ముష్టిలాగా ఉద్యోగాలిచ్చారు. కేవలం 31 వేల ఉద్యోగాలిచ్చారు. మన ప్రభుత్వం 58 నెలల కాలంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మనది ప్రోగ్రెస్ కార్డు.. చంద్రబాబుది బోగస్ కార్డు.వ్యవసాయం, రైతుల విషయంలో హామీలను చూద్దాం. రైతుల రుణమాఫీ అని మోసం చేశారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించలేదు. పెట్టుబడి సాయం ఇచ్చారా?. రైతులకు సమయానికి సబ్సిడీ ఇచ్చింది ఏనాడైనా ఉందా?. సున్నా వడ్డీ ఈ పెద్ద మనిషి ఇచ్చాడా?. మీ బిడ్డ జగన్ ఇచ్చాడా?. కనీసం పెట్టుబడితో రైతులకు భరోసా నిలిచారా?. వ్యవసాయం దండగా అని చంద్రబాబు మాట్లాడింది నిజం కాదా?. బషీర్బాగ్లో రైతులపైకాల్పులు జరిపించింది. ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అంది చంద్రబాబు కాదా?. రైతుల్ని నిట్టనిలువుగా ముంచిన చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ కాదా?మీ జగన్ రైతులకు ఏం చేశాడో చూద్దాం. రైతు భరోసా ఇచ్చాం. పెట్టుబడికి సాయంగా ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది, ఉచిత పంటల బీమా, పంటల కొనుగోలు ఇలా అన్నీ ఈ 58 నెలలకాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా?. ఇది కళ్లకు కనిపిస్తున్న ప్రోగ్రెస్.యెల్లో మీడియా చంద్రబాబుని డెవలప్మెంట్ కింగ్ అని పొగుడుతుంది. మరి చంద్రబాబు ఏం చేశారు?. మన పాలనలో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విలేజ్ క్లినిక్లు కట్టించింది ఎవరు?. వేల రైతు భరోసా కేంద్రాలు కట్టింది ఎవరు?. ఉద్దానం సమస్యను తీర్చింది ఎవరు?. ఎయిర్పోర్టు విస్తరణ చేపట్టింది ఎవరు?. ఈ జగన్లా ఏదైనా అభివృద్ధి చేశావా? అని చంద్రబాబును సీఎం జగన్ నిలదీశారు. ఇలాంటి చంద్రబాబు డెవలప్మెంట్ విషయంలోనూ బోగస్రిపోర్టు ఇచ్చుకుంటున్నారు.ఓ చంద్రబాబూ.. ఇంటింటా ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపింది ఎవరు?. పేదల సంకెళ్లను తెంచుకునేలా చదువుతో బాగు చేయించింది ఎవరు?. నాడు నేడుతో విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చింది ఎవరు? మీ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా? అని అడుగుతున్నా. పచ్చ కామెర్లు వచ్చాయా?. కళ్లెదుట కనిపిస్తున్న రిపోర్టు కనిపించడం లేదా? అని సీఎం జగన్ మండిపడ్డారు.బోగస్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం. పెన్షన్ల విషయంలో కుట్రను గమనించండి. 14 ఏళ్లు సీఎంగా ఉండి అవ్వాతాతల కష్టాలను ఏనాడైనాపట్టించుకున్నాడా?. పెన్షన్లను ఇంటికే అందిస్తున్న ఘనత మీ బిడ్డది. చంద్రబాబు కుట్రలు చేస్తూనే నెపం మీ బిడ్డ జగన్పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ మనపై ఆరోపణలు చేయడం కంటే దిగజారుడు తనం ఉందా?. చంద్రబాబు హయాంలో ఏనాడూ మంచి చేసిన చరిత్రలేదు. చంద్రబాబు ధ్యాస దోచుకోవడం, దోచుకోవడం పంచుకోవడం మీద కాబట్టే అక్కాచెల్లెమ్మలకు న్యాయం జరగలేదు. ఎవరి విశ్వసనీయత ఏమిటి అనేది అందరూ తెలుసుకోవాలి. 2014లో చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీలు.. చేసిన మోసం గుర్తున్నాయా?. ఇంటింటికి జాబ్ అన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇస్తా అన్నారు. కనీసం ఒక్క రూపాయికూడా చంద్రబాబు ఇవ్వలేదు. ఇది మోసం కాదా?. వలంటీర్లు మన ఇంటికే రావాలన్నా. మన బతుకులు బాగుపడాలన్నా. మన ఆస్పత్రులు, బడులు బాగుపడాలన్నా. ప్రతీ ఒక్కరం ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కి 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలు తగ్గేలేదు. సిద్ధమేనా?.. మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో, చెడు చేసిన సైకిల్ ఇంటి బయట, తాగేసిన టీ గ్లాస్ సింక్లో ఉండాలి. మీ చల్లని దీవెనలతో.. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలను గెలిపించాలని కోరుకుంటున్నా ప్రజలకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. -
విజయవాడలో విషాదం.. డాక్టర్ ఘాతుకం.. కుటుంబ సభ్యుల్ని చంపి తానూ..
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడలోని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని.. ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో డాక్టర్ శ్రీనివాస్, ఆయన తల్లి, భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ల మృతికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన శ్రీనివాస్.. ఏడాది క్రితం శ్రీజ అనే ఆస్పత్రిని విజయవాడలో ప్రారంభించాడు. అయితే ఆ ఆస్పత్రి సరిగా నడవటం లేదు. దీంతో ఆయన డిప్రెషలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రిని రెండు నెలల కిందట మరొకరికి అప్పగించనట్లు తెలుస్తోంది.మంగళవారం ఉదయం గురునానక్ నగర్లోని ఇంట్లో శ్రీనివాస్ కుటుంబం విగత జీవిగా కనిపించింది. ఇంటి ఆవరణలో శ్రీనివాస్ మృతదేహాం కొయ్యకు వేలాడుతూ కనిపించింది. దీంతో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా? లేదంటే ఎవరైనా హత్య చేశారా?.. తాను ఆత్మహత్య చేసుకుని, అంతకు ముందు కుటుంబ సభ్యుల్ని శ్రీనివాస్ హత్య చేసి ఉంటాడా? అనే అనుమానాలు రేకెత్తాయి. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఉషారాణి (36), శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)ఘటనా స్థలాన్ని సీపీ రామకృష్ణ పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీలు జరిపాయి. అయితే.. తన కారు తాళం తన అన్నకు ఇవ్వాలంటూ ఎదురింటి వాళ్ల పోస్ట్ బాక్స్లో డాక్టర్ శ్రీనివాస్ పేరిట ఒక లెటర్ దొరికింది. దీంతో ఇది సూసైడ్ కేసు అయ్యి ఉంటుందని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అర్ధరాత్రి టైంలో కుటుంబ సభ్యులను చంపి, తెల్లవారుజామున శ్రీనివాస్ తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్థారించుకున్నారు.శ్రీనివాస్ చాలా సౌమ్యుడు.. ఎవరితోనూ విబేధాలు లేవు. సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హస్పటల్ సక్రమంగా నిర్వహించాడు.తరువాత హాస్పటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే చనిపోయాడని భావిస్తున్నాం. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాం.:::సాక్షిటీవీతో డాక్టర్ శ్రీనివాస్ స్నేహితులు -
చంద్రబాబు గ్యాంగ్ను నమ్మితే రాష్ట్రం అధోగతి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం కోసం అర్రులు చాస్తూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం చంద్రబాబు సహా టీడీపీ గ్యాంగ్ జన్మహక్కులా ఉందని, వారిని మళ్లీ నమ్మితే రాష్ట్రం గతి అధోగతి పాలవుతుందని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో విశాఖ సదస్సు ద్వారా 13.11 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 3.47 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. అంతకుముందు చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఎంత సంపద సృష్టించారో చెప్పమనండి. ఆయన పరిపాలనలోనే రాష్ట్రం కరువులో ఉంద’ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం భూసంస్కరణల్లో భాగంగా శాశ్వత భూమి హక్కు కలి్పంచేందుకు సర్వే చేయాలని సూచించిందని, కానీ దాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోందని ప్రస్తావించారు. రైతులే తమ భూసమస్యల శాశ్వత పరిష్కారానికి, పటిష్టమైన భూరికార్డుల కోసం భూసర్వే జరగాలని కోరుకుంటున్నారన్నారు. వ్యవసాయ రంగానికి చంద్రబాబు రూ.34,185 కోట్లు మాత్రమే కేటాయిస్తే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.55,215 కోట్లు కేటాయించిన విషయాన్ని మరచిపోకూడదన్నారు. గ్రామీణాభివృద్ధికి చంద్రబాబు కేవలం రూ.46,895 కోట్లు మాత్రమే కేటాయిస్తే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.92,655 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఇలా ఏ రంగం చూసినా చంద్రబాబు కన్నా జగన్మోహన్రెడ్డే నంబరు ఒన్గా ఉన్నారన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో చెప్పిన ఫేక్ హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేటముంచారని విమర్శించారు. అందుకే 2019 ఎన్నికల్లో చారిత్రాత్మకమైన తీర్పుతో చంద్రబాబును హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్యాలెస్కు పరిమితం చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల్లో ఓట్ల కోసం ఫేక్ పథకాలను సూపర్ సిక్స్ అంటూ అబద్దాలు, గిమ్మిక్కులతో చంద్రబాబు గ్యాంగ్ వస్తున్నారని ఎద్దేవా చేశారు. వాటి అమలుకే సుమారు రూ.75వేల కోట్లు ఖర్చు ఉంటుందని, ఆచరణయోగ్యం కాకున్నా అధికార యావతో అన్నీ అమలుచేసేస్తామని చెబుతున్నారని విమర్శించారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేసిందనీ, ఇకపై కూడా ఆయా పథకాల ద్వారా కలిగే ప్రయోజనాన్ని మరింత పెంచుతూ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 2024 మేనిఫెస్టో విడుదల చేశారని చెప్పారు. దిగి్వజయంగా అమలవుతున్న ఈ మేనిఫెస్టోతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందుకు కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి పనులే నిదర్శనమని రాజన్నదొర చెప్పారు. -
రెచ్చిపోయిన పచ్చమూక
టీడీపీ శ్రేణుల రౌడీయిజం రోజురోజుకూ పెచ్చుమీరిపోతోంది. యథేచ్ఛగా దౌర్జన్యాలకు తెగబడుతోంది. బెదిరింపులతో వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టాలని యతి్నస్తోంది. ఎన్నికల ప్రచారం సైతం సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు పన్నాగాలు పన్నుతోంది. చివరకు పోలీసుల పహరాలో ఓట్టు అభ్యర్థించునే పరిస్థితిని కల్పిస్తోంది. కాణిపాకం: పూతలపట్టు మండలం వేపనపల్లె గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలపై సోమవారం టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక నానా రాద్ధాంతం సృష్టించారు. బడా నాయకుల డైరక్షన్లో గొడవకు యత్నంచారు. తమ ఊర్లో వైఎస్సార్సీపీ ప్రచారం జరగకూడదని, ఓట్లు అడిగేందుకు వీలులేదంటూ రెచ్చిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. పక్క గ్రామంలో పర్యటిస్తున్న సునీల్కుమార్ వద్దకు వెళ్లి వేపనపల్లెలో ప్రచారం వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రచారం చేసుకోవడం తన హక్కని ఆయన స్పష్టం చేయడంతో చేసేది లేక భద్రత కలి ్పంచారు. డీఎస్పీ రాజగోపాల్రెడ్డి, సీఐ సుదర్శనప్రసాద్, విశ్వనాథరెడ్డి అక్కడి చేరుకుని పటిష్ట బందోబస్తుతో వేపనపల్లెలో ప్రచారం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం 10.45 గంటలకు వేపనపల్లె గ్రామానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్ తదతరులు చేరుకున్నారు. ఇంతలో అక్కడ గుమికూడిన టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా వైఎస్సార్సీపీ నేతలపైకి దూసుకొచ్చారు. పచ్చిబూతులతో దూషించారు. పోలీసుల సమక్షంలోనే ఊర్లో అడుగుపెడితే నరికేస్తామంటూ బెదిరించారు. వీరికి జనసేన కార్యకర్తలు సైతం వంతపాడారు. మొత్తం వ్యవహారం గమనించిన పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పచ్చమూకకు గట్టిగా వారి్నంగ్ ఇచ్చారు. ఎన్నికల నియమావళి మేరకు అభ్యర్థుల ప్రచారం అడ్డుకుంటే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎట్టకేలకు పోలీసుల పహరా నడుమ సునీల్కుమార్ గ్రామంలో ప్రచారం సాగించారు. అయినప్పటికీ పచ్చబ్యాచ్ నినాదాలు చేస్తూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులను సైతం లెక్క చేయకుండా గొడవకు కాలుదువ్వారు. అయితే వైఎస్సార్సీపీ ఎమ్మెలే9్య అభ్యర్థి ప్రచారాన్ని ప్రశాంతంగా ముగించారు. కాగా, ఆరు నెలలకు కిత్రం ఆ గ్రామంలో నిర్వహించిన గడపగడప కార్యక్రమంలో గొడవ చోటుచేసుకుంది. అప్పుడు కూడా కొందరు ఇలానే ప్రవర్తించారు. అప్పుడు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కక్షతోనే ఇప్పుడు మళ్లీ గొడవ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రజాస్వామ్య విరుద్ధం వేపనపల్లెగ్రామంలో జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్ మండపడ్డారు. ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాళ్ల దాడి చేసినప్పుడే ఓపికతో వ్యవహరించామన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటుంటే అడ్డగించడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement