వివాహిత అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Published Sat, May 14 2016 10:57 AM

married woman commits suicide east godavari district

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట మండలం మెట్ల కాలనీలో బి.విజయ (28) అనే వివాహిత శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మూడేళ్ల క్రితం ఈమెకు వివాహమైంది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు విజయ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ఆ విషయాన్ని గమనించిన స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... విజయ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement