కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట మండలం మెట్ల కాలనీలో బి.విజయ (28) అనే వివాహిత శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మూడేళ్ల క్రితం ఈమెకు వివాహమైంది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు విజయ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... విజయ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.