కర్నూలు(హాస్పిటల్):
‘‘కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో విశాలమైన స్థలం ఉంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ప్లాన్ రూపొందించాలి.’’ అని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని సూపర్స్పెషాలిటీ మార్టన్ సమావేశ హాలులో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు ప్రభుత్వాసుపత్రి అప్గ్రేడ్కు హామీ ఇచ్చారన్నారు. ఆ దిశగా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవా మౌలిక సదుపాయాల సంస్థ సంయుక్తంగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేందుకే ఆసక్తి చూపుతున్నారని.. అందువల్ల పెద్దాసుపత్రిలోనూ ఆధునికమైన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఆసుపత్రిలో వైద్యుల నియామకానికి చర్యలు చేపడతామన్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా పోలీసు ఔట్పోస్టు, సెక్యూరిటీ రూంలను కూలగొట్టిన విషయాన్ని కమిటీ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. డీజీపీతో మాట్లాడి ఎస్పీఎఫ్ భద్రత కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేందుకు ఆసుపత్రిలో సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పందుల నియంత్రణకు ఆసుపత్రి చుట్టూ ప్రహరీ ఎత్తు పెంచి సోలార్ ఫెన్సింగ్ వేయిస్తామన్నారు. వేలాదిగా వచ్చే రోగులు, సహాయకులతో ఆసుపత్రి అస్తవ్యస్తంగా ఉంటోందని.. అందువల్ల ఇకపై గుర్తింపు కార్డులు జారీ చేస్తామని తెలిపారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలన్నారు. ఆసుపత్రి ఆవరణలో జీవనధార మందుల దుకాణం ఉన్నప్పటికీ వైద్యులు మందులను బయటకు రాస్తున్నారని.. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో పేషెంట్ కేర్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, సీఎస్ఆర్ఎంఓలు శివప్రసాద్, ప్రవీణ్కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ జోజిరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్లు కృష్ణానాయక్, జిక్కి, ఆసుపత్రి అడిషనల్ డెరైక్టర్ మోహన్ప్రసాద్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు వల్లపురెడ్డి జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Breadcrumb
ఆసుపత్రి అభివృద్ధికి మాస్టర్ప్లాన్
Published Wed, Sep 24 2014 11:53 PM
# Tag
Related news
-
ఆర్థికాభివృద్ధి అదుర్స్
సెల్ ఫోన్ నేనే కనిపెట్టా.. ఐటీని నేనే సృష్టించా.. శంషాబాద్ ఎయిర్పోర్ట్నూ నేనే కట్టా.. హైదరాబాద్లో రింగు రోడ్డునూ నేనే వేశా.. సింధూకు బాడ్మింటన్ ఆడమని నేనే చెప్పా.. అంతెందుకు నా గైడెన్స్ మేరకే సత్య నాదెళ్ల ఇవాళ అంతటివాడయ్యాడు.. తుపాన్లనే ఆపగలిగాను.. సంపద సృష్టికి నేనే బ్రాండ్ అంబాసిడర్..’ ఇలా కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పేదెవరంటే, చంద్రబాబు అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అప్పుడు బాబు హయాంలో, ఇప్పుడు జగన్ హయాంలో దాదాపు ఒకే బడ్జెట్.. అప్పులు అప్పటి కంటే ఇప్పుడే తక్కువ.. అయినప్పటికీ సీఎం జగన్ ఈ ఐదేళ్లలో పేద ప్రజల ఖాతాల్లో వివిధ పథకాల రూపేణ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. తద్వారా ఆర్థిక చక్రాన్ని పరుగులు పెట్టించారు. అభివృద్ధి విషయంలో కొత్త పుంతలు తొక్కించారు. ఈ ఐదేళ్లలో వార్షిక సగటు వృద్ధి 6.20 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనం. అన్ని రంగాల్లోనూ స్పష్టమైన అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది. ఇందుకు కేంద్ర గణాంకాలే సాక్ష్యం. ► స్థిర ధరల ప్రకారం గత ఐదేళ్లలో జీఎస్డీపీ పెరుగుదల రూ.1,94,063 కోట్లు ► అదే బాబు పాలనలో రూ.1,28,341 కోట్లే ► కోవిడ్ సంక్షోభంలోనూ జగన్ హయాంలోనే భారీగా పెరిగిన సంపద ► స్థిర ధరల ఆధారంగా 2023–24 రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 7.35 శాతం ► బాబు హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6.26 లక్షల కోట్లు ► 2023–24లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.8.20 లక్షల కోట్లు ► కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ లెక్కలేఇందుకు నిదర్శనం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ వైపు సంక్షేమాభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ.. మరో వైపు పేదరికాన్ని తగ్గించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే ముందంజలో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి, సంపద సృష్టించారనడానికి కొలమానం అ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలే. ఆర్థిక మందగమనం, కోవిడ్ సంక్షోభాలను సైతం అధిగమించి సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో వరుసగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కోవిడ్ సంక్షోభం లేనప్పటికీ గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటు వార్షిక వృద్ధి రేటు 5.15 శాతం నమోదు కాగా, అదే సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో సగటు వార్షిక వృద్ధి 6.20 శాతం నమోదైంది. పదే పదే సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లి ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు.. తన ఐదేళ్ల పాలనలో కోవిడ్ లాంటి సంక్షోభం లేనప్పటికీ సంపద సృష్టించడంలో ఎందుకు వెనుకబడ్డారో చెప్పాలి. ప్రజలు ఏది చెబితే అదే నమ్ముతారనుకోవడం ఎల్లవేళలా సాగదనే విషయం చంద్రబాబు మరిచిపోతున్నారు. తనకొక్కడికే సంపద సృష్టించడం వచ్చనే ధోరణిలో చంద్రబాబు ఇస్తున్న బిల్డప్ అంతా తుస్ అని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ద్వారా వెల్లడైంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నమోదులో టాప్ పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉందని స్పష్టమైంది. ఈ గణాంకాలన్నీ 2011–12 సంవత్సరం స్థిర ధరల ఆధారంగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ గణాంకాలన్నీ పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. కోవిడ్లోనూ రయ్.. రయ్.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1,28,341 కోట్లు పెరిగింది. అంటే మొత్తం ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 25.74 శాతం పెరిగింది. అంటే సగటు వార్షిక వృద్ధి 5.15 శాతంగా నమోదైంది. అదే సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1,94,063 కోట్ల మేర పెరిగింది. అంటే ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 30.95 శాతం. వార్షిక సగటు వృద్ధి 6.20 శాతంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే సంపద సృష్టించడంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో గత చంద్రబాబు పాలన కన్నా సీఎం వైఎస్ జగన్ పాలన ఎంతో మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మందగమనం, కోవిడ్ సంక్షోభంతో రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా రూపంలో రాబడి తగ్గిపోయినప్పటికీ రాష్టంలో ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోకుండా కొనసాగించే చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్నారు. మరో పక్క కోవిడ్లోనూ పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా నగదు బదిలీ పథకాలను అమలు చేశారు. ఈ చర్యలతో రాష్ట్ర ఆర్థిక చక్రం ఆగిపోకుండా నిలదొక్కుకుంది. అందువల్లే జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల ఎక్కువగా నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.35 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ వేసిన అడుగులు చక్కటి ఫలితాలిచ్చాయి. ప్రధానంగా పారిశ్రామికాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. ఎలాంటి హడావుడి లేకుండా అన్ని ప్రాంతాలకు భారీ పరిశ్రమలను తీసుకురావడమే కాకుండా, అవి ఉత్పత్తిని ప్రారంభించేలా అన్ని విధాలా ఊతమందించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా టాటాలు, బిర్లాలు, అదానీ, అర్సెలర్ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలతో పాటు విదేశీ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఉత్తరాంధ్రలోని అచ్యుతాపురం వద్ద జపాన్కు చెందిన యకహోమా టైర్స్ (అలయన్స్ టైర్స్ గ్రూపు), అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, రాండ్స్టాండ్, లారస్ ల్యాబ్ వంటి దిగ్గజ సంస్థలు, విజయనగరంలో శారడా మెటల్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కోస్తాంధ్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిం ఇండస్ట్రీస్, కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద పెన్సులిన్ తయారీ సంస్థ లూఫిస్ ఫార్మా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఐటీసీ స్పైసెస్ పార్కు, పిడుగురాళ్ల వద్ద శ్రీ సిమెంట్స్, నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారీ, క్రిభ్కో ఇథనాల్, గ్రీన్లామ్ సొల్యూషన్స్, గోకుల్ ఆగ్రో ప్రారంభం అయ్యాయి. రాయలసీమలోని చిత్తూరులో బ్లూస్టార్, డైకిన్, హావెల్స్, యాంబర్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్స్, టీసీఎల్, వైఎస్సార్ జిల్లాలో డిక్సన్, సెంచురీ ప్లేవుడ్స్, బిర్లా గార్మెంట్స్, కర్నూలు జిల్లాలో రాంకో సిమెంట్స్, జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ వంటి భారీ పెట్టుబడులు వచ్చాయి. ► చంద్రబాబు ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు రూ.59,970 కోట్లు ►ఈ 5 ఏళ్లలో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమల్లో రూ.78,514 కోట్ల పెట్టుబడులు ►వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాలేదంటూ ఎల్లో మీడియాతో కుట్ర చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. ►తప్పుడు సమాచారంతో యువతను రెచ్చగొట్టి లబ్ధిపొందాలనే చంద్రబాబు అండ్ కోకు ఈ వాస్తవాలు కనిపించవా... ►సంక్షేమంతో పాటు సమానంగా పరిశ్రమలకు అగ్రతాంబూలం ఇస్తే నీచమైన రాతలా.. – చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి, అమరావతి ఇదీ జగన్ అంటే.. ►గత ప్రభుత్వంలా ఏటా పెట్టుబడుల సదస్సు అంటూ హడావుడి చేయలేదు. ఒక్కసారి మాత్రమే 2023లో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించగా.. 386 ఒప్పందాల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఏ రాష్ట్ర పెట్టుబడుల సదస్సుకు రాని రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా విశాఖ రావడమే కాకుండా రూ.50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఐదేళ్లలో బిర్లాలు, అదానీ, మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి విచ్చేసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ► సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులోజరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయి. మన రాష్ట్రంలో మాత్రం సదస్సు జరిగి ఏడాది తిరక్కుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఎంఎస్ఎంఈలకు పునరుజ్జీవం కోవిడ్ సమయంలో రీస్టార్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం వంటి పథకాలతో ఎంఎస్ఎంఈలు మళ్లీ ఊపిరిపోసుకున్నాయి. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలతో ఆదుకుంటోంది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. నిర్వహణ వ్యయం తగ్గించి పెద్ద పరిశ్రమలతో పోటీ పడేలా క్లస్టర్ విధానాన్ని, ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రూ.118 కోట్లతో జగన్ ప్రభుత్వం ర్యాంప్ కార్యక్రమం చేపట్టింది. చంద్రబాబు సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530 ఎంఎస్ఎంఈలు ఉంటే.. ఇప్పుడు ఏడు లక్షలు దాటాయని ఉద్యమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామిక కారిడార్లతో రాష్ట్రం రికార్డులు పరిశ్రమలకు అన్ని రకాల మౌలికవసతులు ఒకే చోట లభించేలా మూడు పారిశ్రామిక కారిడార్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మూడు పారిశ్రామిక కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రంగా రికార్డులకు ఎక్కింది. ►విశాఖ–చెన్నై కారిడార్(వీసీఐసీ) ►చెన్నై–బెంగళూరు కారిడార్ ►హైదరాబాద్–బెంగళూరు కారిడార్.. ఈ మూడూ అభివృద్ధి దశలో ఉన్నాయి. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఇందులో భాగంగా కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్గా రూపుదిద్దుకుంటోంది. తిరుపతి జిల్లాలోని 2,500 ఎకరాల్లో క్రిస్ సిటీ ఏర్పాటు కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కలి్పస్తోంది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, 14 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. విశాఖ–చెన్నై కారిడార్(వీసీఐసీ) విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా రెండు గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ నోడ్లు తీర్చిదిద్దారు. విశాఖపట్నంలోని నక్కపల్లి–రాంబిల్లి క్లస్టర్లు, చిత్తూరు నోడ్లో ఏర్పేడు, శ్రీకాళహస్తి పారిశ్రామిక క్లస్టర్లలో అంతర్గత మౌలిక సదుపాయాలు కల్పించారు. వీసీఐసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎక్స్టర్నల్ సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతి స్పెషల్ జోన్లోని నాయుడుపేట, అనకాపల్లి స్పెషల్ జోన్లోని అచ్యుతాపురం ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేశారు. నాయుడుపేటలో 276 పరిశ్రమల ఏర్పాటుతో రూ.3,051 కోట్ల పెట్టుబడులతో 9,030 ఉద్యోగాలు కల్పించారు. అచ్యుతాపురంలో మొత్తం 2,272 పరిశ్రమల ఏర్పాటుతో రూ.12,381 కోట్ల పెట్టుబడులు రాగా 60 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ► వీసీఐసీలో భాగంగా వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తిలో 6,740 ఎకరాలలో పరిశ్రమల హబ్ తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. కొప్పర్తి కేంద్రంగా మోడల్ ఇండ్రస్టియల్ పార్కు, ఎంఎస్ఈ సీడీపీ, వైఎస్సార్ ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రూ.2595.74 కోట్ల నిక్డిక్ట్ నిధులతో అభివృద్ధికి కార్యాచరణ రూపొందించారు. అక్కడ 66 పరిశ్రమలు కొలువుదీరాయి. ప్లగ్ అండ్ ప్లే పరిశ్రమల కోసం ఇప్పటికే షెడ్ల నిర్మాణం పూర్తయింది. మొత్తం రూ.1,875.16 కోట్ల పెట్టుబడులు, 13,776 మందికి ఉద్యోగాలిచ్చేందుకు కొప్పర్తి సిద్ధమైంది. హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఈ కారిడార్లో ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. చంద్రబాబు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా ► పెట్టుబడుల సదస్సు అంటూ గత ప్రభుత్వం రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయని ఎల్లో మీడియాలో ఊదరగొట్టేశారు. కనీసం అందులో 10 శాతం పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోయేది. బాబు హయాంలో కనీసం 5 శాతం పెట్టుబడులు కూడా రాలేదు. దీనిపై మీ ఎల్లో మీడియాలో రాయించగలవా.. ►బాబు హయాంలో కేంద్ర సహకారం అందినా.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉన్నా.. పెట్టుబడుల ప్రవాహానికి అనుకూల వాతావరణం ఉన్నా.. తన సొంత అజెండాతో పారిశ్రామిక ప్రగతిని బాబు నిర్లక్ష్యం చేశారు. జగన్ అధికారంలోకి రాగానే పరిశ్రమలకు పట్టం కడుతున్న వేళ.. కోవిడ్ లాక్డౌన్తో రెండేళ్లు ప్రపంచమంతా పడకేసింది. అయినా జగన్ గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు. ►జగన్ పాలనలో రాష్ట్రంలో 163 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.78,514 పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. ఉత్పత్తి ప్రారంభించాయి. బాబు హయాంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు పెడితే.. జగన్ హయాంలో ఏటా రూ.15,702.8 కోట్ల పెట్టుబడులు పెట్టారు. వివిధ దశల్లో రూ.2.46 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందం జరిగిన పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. అదనంగా దావోస్ పర్యటనలో మరో రూ.1,26,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా యువతకు 38 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒక ఫోన్ కాల్ దూరంలో మీకు నేను ఉన్నానంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఇచ్చిన అభయం వారి నమ్మకాన్ని రెట్టింపు చేసింది. గత మూడేళ్ల నుంచి పూర్తిగా 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు ఆధారంగా నిర్వహిస్తున్న సులభతర వాణిజ్యం సర్వేలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 6 లక్షల మందికిపైగా ఉపాధి ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా రాష్ట్రంలో 6 లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తోంది. ఎంఎస్ఎంఈలు ఒక సంఘంగా ఏర్పడి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసుకునే విధంగా క్లస్టర్ రూపంలో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశారు. ఇందుకు ప్రతి జిల్లాలో కనీసం రెండు చొప్పున మొత్తం 54 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల్ని అందించేలా మరో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మరో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో టెక్నాలజీ సెంటర్ కొనసాగుతోంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో ఈ టెక్నాలజీ సెంటర్ అభివృద్ధి చేస్తున్నారు. బంధం కొనసాగిస్తాం ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టిన తాము భవిష్యత్తులో కూడా అదే బంధాన్ని కొనసాగిస్తాం. ఇందులో భాగంగా 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. రిలయన్స్ రిటైల్ ద్వారా రాష్ట్రంలో 1.20 లక్షల మంది కిరాణా వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నాం. 6,000 గ్రామాల్లో సేవలు అందిస్తున్న రిలయన్స్ రిటైల్ ద్వారా రాష్ట్రంలో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలి్పస్తున్నాం. – ముఖేశ్ అంబానీ రెండు నెలల్లో రెండు యూనిట్లు ఆదిత్య బిర్లా గ్రూపు ద్వారా రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేశాం. వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్కు భూమి పూజ చేశాం. తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ను ఏర్పాటు చేస్తున్నాం. ఆరు వ్యాపారాల్లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. – కుమార్ మంగళం బిర్లా అర నిమిషంలోనే ఒప్పించారు మే నెలలో సీఎం జగన్ను కలిసి 30 సెకన్లు మాత్రమే మాట్లాడా. ఈ సందర్భంగా మా అబ్బాయి బయో ఇథనాల్ ప్లాంట్ స్థాపనకు వివిధ రాష్ట్రాలు పరిశీలిస్తున్న విషయం చెప్పా. ఎక్కడో ఎందుకు? మా రాష్ట్రంలో పెట్టండి అని సీఎం ఆహా్వనించారు. బయో ఇథనాల్ పాలసీని యూనిట్ ప్రారంభమయ్యే సరికి రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఆరు నెలల్లోనే రాజమహేంద్రవరంలో యూనిట్కు శంకుస్థాపన చేశాం. –సీపీ గుర్నానీ, సీఈవో, టెక్ మహీంద్రా రాష్ట్రం వైపు ఐటీ దిగ్గజ సంస్థల చూపు దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు రాష్ట్రంలో తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఇన్ఫోసిస్, విప్రో, రాండ్స్టా్టండ్, బీఈఎల్, అమెజాన్ డీసీ వంటి అనేక దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. బీపీఓ కార్యకలాపాలకు ప్రధాన వేదికగా నిలిచిన విశాఖ నగరం.. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్(డీసీ)ను ఆకర్షిస్తోంది. ఇన్ఫోసిస్ రాష్ట్రంలో తొలి డెవలప్మెంట్ సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయడంతో.. విప్రో కూడా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. విశాఖ అనగానే పల్సస్ గ్రూపు, డబ్ల్యూఎన్ఎస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి బీపీవో కార్యకలాపాలే కనిపించేవి. ఇప్పుడు బీచ్ ఐటీ డెస్టినీ పేరుతో విశాఖకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ల ఆకర్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఐటీ హబ్గా విశాఖ గత నాలుగేళ్లుగా రాష్ట్రంలోని ఐటీ రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెరిగాయి. చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643గా ఉంది. అందులో సగం మందికి ఉద్యోగాలు దివంగత నేత వైఎస్సార్ హయాంలో వచ్చినవే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కొత్తగా 47,908 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 75,551కు చేరుకుంది. స్టార్టప్స్ కూడా 161 నుంచి 586కు చేరాయి. స్టార్టప్స్లో 2019 నాటికి 1,552 మంది పనిచేస్తుంటే ఇప్పుడు ఆ సంఖ్య 55,669కు చేరింది. ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) చెబుతున్నవే. తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ‘కల్పతరువు’తో పాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు విశాఖలో ఏర్పాటు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్టెక్ జోన్లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో ముందు వరుస పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటమే కాకుండా అధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తోంది. సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల గుంటూరులో వెల్కమ్ ఫైవ్స్టార్ హోటల్ను ప్రారంభించాం. ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల పార్క్ ప్రారంభిస్తున్నాం. – సంజయ్ పూరి, ఐటీసీ సీఈవో -
ప్రగతి గోదావరి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం: పైరు పచ్చని సీమ ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రగతి బాటన పరవళ్లు తొక్కుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అద్భుత అభివృద్ధి సాధించింది. ఆక్వా వర్సిటీ, మెడికల్ కళాశాలలు, ఫిషింగ్ హార్బర్, వాటర్గ్రిడ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులెన్నో పశ్చిమ ముంగిట వాలాయి. పోలవరం ప్రాజెక్టు పనులు గాడిన పడ్డాయి. జిల్లా పునర్వి భజనతో ఏలూరు జిల్లా కొత్తగా ఆవిర్భవించింది. ఫలితంగా పాలన పల్లె ముంగిటకు చేరింది. ఆణి‘మత్స్యం’.. ఆక్వా వర్సిటీ తీరంలో మత్స్య ఎగుమతులు, మత్స్యసాగులో శాస్త్రీయ పద్ధతులు పెంచేందుకు నరసాపురం మండలం సరిపల్లి వద్ద మత్స్య యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.332 కోట్లతో 40 ఎకరాల స్థలంలో యూనివర్సిటీ పరిపాలన భవనం, హాస్టళ్లు, వీసీ చాంబర్ పనులు చేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో మరో రూ.400 కోట్లు యూనివర్సిటీకి ఖర్చు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి లక్ష్మణేశ్వరం గ్రామంలో తుఫాన్ రక్షిత భవనంలో ఆక్వా కోర్సులు ప్రారంభించారు. బియ్యపుతిప్ప వద్ద రూ. 430 కోట్లతో ఫిషింగ్ హార్బర్, రూ.490 కోట్లతో వశిష్టగోదావరి వంతెన, అంబేడ్కర్ కోనసీమ జిల్లా విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు రూ. 1400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు పట్టాలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. సహజసిద్ధ ప్రవాహం మళ్లింపు పోలవరం ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా గాడిలో పెట్టి కరోనా కష్టకాలంలోనూ పనులు వేగంగా సాగేలా చేశారు. ప్రధా నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 48 స్పిల్ వే గేట్ల నిర్మాణం, స్పిల్ చానల్ ఎగువ, దిగువ డ్యాంలు, 2021 జనవరి 11 నాటికి పూర్తి చేసి 6.1 కిలోమీటర్ల గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. సహజసిద్ధ గోదావరి నది ప్రవాహాన్ని ఇంత భారీ ఎత్తున మళ్లించడం చరిత్రలో ఇదే ప్రథమం. తాడువాయిలో 3095 పునరావాస ఇళ్ళను ఒకేచోట మెగా టౌన్షిప్ మాదిరి రూ.488 కోట్లతో నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. ఏలూరు వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరుతోపాటు, పాలకొల్లు మండలంలో వైద్యకళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏలూరులోని వైద్య కళాశాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రూ.60 కోట్లతో అధునాతన భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆమోదంతో 2022–23 విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.525 కోట్లు. ► పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్లతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమ్మిలేరుకు ‘వాల్’జడ ఏలూరు నగరాన్ని తమ్మిలేరు ముంపు నుంచి రక్షించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. 2006లో తమ్మిలేరు ముంపుతో ఏలూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నాని రిటైనింగ్వాల్ నిర్మించాలని విన్నవించారు. వెంటనే ప్రతిపాదనలు తయారు చేయించి వైఎస్సార్ అనుమతులు మంజూరు చేశారు. ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 2019లో అంచనాలు సవరించి రూ.80 కోట్లతో ఆరు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. రెండో దశలో 2.5 కిలోమీటర్ల మేర రూ.55.50 కోట్లతో నిర్మాణం ప్రారంభించి 90 శాతానికిపైగా పూర్తి చేశారు. ఇతర అభివృద్ధి పనులు ► రూ.220 కోట్లతో నరసాపురంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, భీమవరం, యలమంచిలి, మండలాలకు ఉపయోగకరంగా రూ.113 కోట్లతో నిరి్మంచనున్న భారీ విద్యుత్ సబ్స్టేషన్ పనులు టెండర్ దశకు చేరుకున్నాయి. ► భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో రూ.100 కోట్లతో పట్టణంలో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ► యనమదుర్రు డ్రెయిన్పై నిరి్మంచిన మూడు వంతెనలకు రూ.36 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా త్వరలో పనులు మొదలుకానున్నాయి. ► ఏలూరు జిల్లా చింతలపూడి– జంగారెడ్డిగూడెం మీదుగా రాజమండ్రికి అనుసంధానం చేస్తూ 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. జీలుగుమిల్లి– కొవ్వూరు మధ్య ఎన్హెచ్ 365 (బీబీ) రూ.605 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. రూ.124 కోట్ల వ్యయంతో 516 (డీ) జాతీయ రహదారిని కొయ్యలగూడెం– జీలుగుమిల్లి మధ్య అభివృద్ధి చేశారు. -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం -
మోసం, దగా, కుట్ర చంద్రబాబు పేటెంట్: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. విశాఖపై ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం.విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించాం. కొన్ని కారణాలతో ఆలస్యమైంది. సీఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చెప్పిన మాటమీద నిలబడటం కోసం ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకుంటారు. విశాఖ పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తరువాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయి. చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు. టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారు’ అని బొత్స అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏమన్నారంటే.. విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట తప్పని మనిషని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన మాట చెబితే దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, దానిని నెరవేర్చాలనే మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి గారి బిడ్డగా ఆయన నైజం అది. అలాంటి నేపథ్యంలోనే కిందటి సారి విశాఖపట్టణంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ఓ మాట చెప్పారు. దేవుడి దయతో రాష్ట్ర ప్రజల సహకారంతో మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం. 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖపట్టణంలోనే చేస్తాను. విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్గా తీర్చిదిద్దడమే కాకుండా ఇక్కడ అన్ని మౌలికసదుపాయాలను కల్పించి ఒక హబ్గా తయారు చేస్తానంటూ మాట ఇచ్చారు. అప్పట్లో ఆ కార్యక్రమానికి విచ్చేసిన ఇన్వెస్టర్లందరికీ విశాఖపట్టణంలో పెట్టుబడులకు ఓ భరోసా కల్పించారు. - విశాఖ ఇన్వెస్టర్ల మీటింగ్లో తాను ఏమైతే మాట ఇచ్చారో.. దానికి నూటికి నూరుశాతం జగన్గారు కట్టుబడి ఉన్నారు. అధికారంలోకి రాగానే తాను ఇక్కడికే తన పరిపాలన తెస్తానన్నారు. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు, వాటికి కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా సంస్థలు రోజుకో విధంగా విషం చిమ్మాయి. లేనిపోని గాలికబుర్లు, అభూతకల్పనలతో ఆయనపై దుమ్మత్తిపోస్తున్నప్పటికీ.. తన మాటపై తాను ధృఢంగా నిలబడి ఉన్నారు. రేపటి ఎన్నికల్లో గెలవగానే ఇక్కడ్నే ఆయన ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే విశాఖ అగ్రగామిగా నిలబడుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంత మణిహారంగా డిస్నీ ఆఫ్ విశాఖపట్టణం మారనున్నదని చెప్పడానికి మేం గర్విస్తున్నాం. ఇవ్వన్నీ మరోమారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ నెలకొల్పుతారు. అందులో పెద్ద సందేహమేదీలేదు. ఆయన చెప్పినట్లు.. డిస్నీ ఆఫ్ విశాఖకు ఇక్కడున్న సహజ వనరులు, సీకోస్ట్, పోర్టులు, ఏయిర్పోర్టు, హైవే కనెక్టివిటీ తదితర సదుపాయాలన్నీ అనుకూలించనున్నాయి. బెంగుళూరు, ముంబై, చెన్నై తరహాలో విశాఖ పట్టణాన్ని కూడా తీర్చిదిద్దే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కనుకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ దిశగా ముందుకెళ్లే కృతనిశ్చయంతో మేమున్నాం. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కిందటేడాదిన విశాఖకు సుమారు 40 కిలోమీటర్ల దూరమున్న భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్మోహన్రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. పనులు కూడా అప్పుడే మొదలయ్యాయి. ఏజెన్సీలకు బిడ్స్ అప్పగించడం కూడా జరిగింది. ఇవన్నీ పూర్తిచేసుకుని 6 మిలియన్ల పాసింజర్ల ప్రయాణ రాకపోకలకు విమనాశ్రయాన్ని మొదటి దశలో సిద్ధం చేస్తున్నామనేది అందరికీ తెలిసిన విషయమే. దానికి కనెక్టివిటీ చేస్తూ గాజువాక నుంచి భోగాపురం వరకు మెట్రో ట్రైన్ ఏర్పాటుకు డీపీఆర్ తయారు చేసి త్వరలోనే దాన్ని పూర్తిచేయనున్నాం. వీటన్నిటి పట్ల మా జగన్ గారి కృతనిశ్చయంతో ఉన్నారని మరోమారు గుర్తుచేస్తున్నాను. ఇది మా ప్రభుత్వ తాలూకూ ఆలోచన, ప్రణాళికగా చెబుతున్నాను. వేగంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులు అదేవిధంగా ఈ ప్రాంత వాసులు ఇక్కడ ఫిష్షింగ్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిష్షింగ్ హార్బర్లు, శ్రీకాకుళంలో మరో పోర్టు కావాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. దీనివలన మత్స్యసంపదను పెంచుకుని పెట్టుబడులను ఆకర్షిస్తూ వాణిజ్య అవసరాలను తీర్చుకునే వెసులు ఉంటుందన్నది ప్రజల ఆలోచన. వీటిపై గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. అదే శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక మూలపేటలో సుమారు రూ. 430 కోట్లతో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు జరుగుతోన్నాయి. విశాఖ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ఒక ఫిష్షింగ్ హార్బర్ను కూడా నిర్మిస్తున్నారు. వీటితో పాటు అక్కడ సమీప ప్రాంతాల్లో మరో 10 ఫిష్షింగ్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసి పనులు కూడా ప్రారంభించారు. మేం చెప్పేవన్నీ మాటలతో చెప్పి ఊరుకున్నవి కావు.. పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పనులు వేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబులా సెల్ఫ్ డబ్బా కొట్టుకోం ఆనాడు ఐటీ రంగాన్ని విశాఖపట్టణం తెచ్చేందుకు దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర్రెడ్డి గారు కృషి చేశారు. అప్పట్లోనే కొన్ని టవర్ల ఏర్పాటుకు ఆయన శ్రీకారం చుడితే.. ఇవాళ ఇక్కడ ఇన్ఫోసిస్ డెటా సెంటర్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలను జగన్మోహన్రెడ్డి గారు తెచ్చారు. అంతేకాకుండా ఇక్కడ దాదాపు రూ.22 వేల కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. మేము చంద్రబాబు మాదిరిగా చేయని పనులకూ డబ్బాలు కొట్టుకునే రకాలం కాదు. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేన్నట్టు చెప్పుకుని పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు లాంటి తత్త్వం మాది కాదు. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు చేసేదే చెబుతారు. చెప్పిందే చేసి చూపుతారు. అదే ఆయన ప్రత్యేకత నైజం. పైశాచికానందంలో రామోజీ, రాధాకృష్ణలు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు కలిసి చంద్రబాబు కోసం ఓ పైశాచిక క్రీడకు తెరలేపారు. ఆ మేరకు జగన్మోహన్రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై రోజుకో పైశాచిక వార్తలు రాసి.. వికృతానందం పొందుతున్నారు. వాళ్లకు మా మీద నెగిటివ్ వార్తలు రాయడమే పైశాచికానందం అంట. దీనివల్ల చివరకు వాళ్లు సాధించేదేముంది..? ఆ రెండు పత్రికల్లో వాళ్లు రాసే విషయాల్లో ఒక్కటంటే ఒక్క పర్సంటేజీ నిజాలు కనిపించడం లేదు. పేరెంట్స్ మీటింగ్కు రాజకీయం అంటగడతారా..? ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఇవాళ ఎలాంటి వార్తలొస్తున్నాయంటే, ఉదాహరణకు నేను మంత్రిగా పర్యవేక్షించే శాఖనే తీసుకుందాం. విద్యా శాఖపై ఇవాళ కూడా మూడు వార్తలు రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ మీటింగ్స్ కూడా పెట్టకూడదంట. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగా చదివి పరీక్షలు రాస్తే.. మార్కులు బాగా రావాలని కోరు కుంటారు. ఆయా విషయాలపై చదువు చెప్పిన ఉపాధ్యాయులతోనూ మాట్లాడాలని కోరుకోవడం సహజమే. అలాంటి సందర్భాల్లో పెట్టే పేరెంట్స్ మీటింగ్నూ రాజకీయాలకు ముడిపెట్టి వార్తలెలా రాస్తారు..? ప్రభుత్వ స్కూళ్లల్లో జరిగే పేరెంట్స్ కమిటీ మీటింగ్లకు రాజకీయ నేతలుగా మేం అక్కడికెళ్లి పబ్లిసిటీ చేస్తామా..? విద్యార్థికి చదువు చెప్పిన టీచర్, విద్యార్థి తల్లిదండ్రులు కూర్చొని అతని చదువు పరిస్థితిపై మాట్లాడుకునే వాతావరణం అది. దానికి రాజకీయం రంగు పులమడం దేనికి..? మీడియా సంస్థలుగా ఆ రెండు పత్రికలు ఈ వ్యవస్థను ఏం చేద్దామనుకుంటున్నాయి..? మీరు చేసేది చాలా తప్పుకదా..? 18,200 మంది టీచర్లను రిక్రూట్ చేశాం.. స్థానికంగా కూటమి అభ్యర్థి ఒకరు విద్యాసంస్థ నడుపుతున్నాడంట. ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లకు రంగులేయడం కాదు. టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి అప్పాయింట్మెంట్లు ఇవ్వాలంటున్నాడు. గత ఐదేళ్ల కాలంలో మా ప్రభుత్వం ఏం చేసిందో ఆయనకేం తెలుసు..? ఇంగ్లీషు మీడియం విద్యాబోధనపై టీచర్లకు ట్రైనింగ్ ఇప్పించాం. ఎప్పటికప్పుడు వాళ్లను మోటివేట్ చేస్తూ లెర్నింగ్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలనలు జరుగుతున్నాయి. ఈ విషయాలన్నింటిపై టీచర్లను అడిగితే చెబుతారు కదా..? మా ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జగన్ గారు 18,200 మంది టీచర్లను రిక్రూట్ చేసుకుని అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాం. ఇవన్నీ తెలియక ఎవరంటే వారు మైండ్లేని మాటలు మాట్లాడటం మంచిదికాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి అనుకూలమా..? వ్యతిరేకమా..? ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి సంబంధించి జగన్ గారు ఇప్పటికే అనేక ప్రణాళికలు అమల్లోకి తెచ్చి పూర్తిచేస్తున్నారు. రేపు అధికారంలోకి రాగానే విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ కాపిటల్గా తీర్చిదిద్దబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఉత్తరాంధ్రలో అనేక ఐటీ తదితర పరిశ్రమలు, పోర్టులు, హార్బర్లు, ఏయిర్పోర్టులు కూడా వచ్చాయి. మరి, కూటమి వీటన్నింటికీ అనుకూలమా..? వ్యతిరేకమా..? దీనిపై సమాధానం చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేసుకుని ఓట్లు అడగాలని డిమాండ్ చే స్తున్నాం. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని బీజేపీతో చెప్పించగలరా..? విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మా విధానం చెప్పింది. దీనిపై మేము ఒక లెటర్ ఇచ్చి ఊరుకున్నామని కూడా ఆ రెండు పత్రికలు రాశాయి. అంటే, గతంలో జరిగిన విషయాలపై బుర్ర ఉండాల్నా.. లేదా..? జగన్మోహన్రెడ్డి గారు ఢిల్లీలో ప్రధాని మోదీగారిని కలిసినప్పుడు.. అదే మోదీ గారు విశాఖకు వచ్చినప్పుడు కూడా స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై మా విధానాన్ని స్పష్టంగా వివరించారు. అదే విధానంపైనే ఇప్పటికీ మేం స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే పోరాడుతున్నాం. మరి, ఈ అంశంపై కూటమి సమాధానం ఏంటి..? చంద్రబాబు కొత్తగా కూటమిలో చేరిన సందర్భంగా .. ఆ కూటమితో స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని చెప్పించమనండి. బీజేపీ పెద్దల నోటివెంట ప్రైవేటీకరణ చేయబోమని చెబితే అందరం వింటాం కదా..? ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. నాసిరకం మద్యం అని బాబుకు ఎలా తెలుసు? జగన్ గారు మ్యానిఫెస్టోలో దశలవారీగా మద్యం నిషేధిస్తామన్నారు. అదే విధానాన్ని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇవాళ ఎక్కడ చూసినా.. మద్యం ధరలపై చంద్రబాబు చెబుతున్నారు. ప్రజల నిత్యావసరాలు, మత్తు కోసం తాగే మద్యం ఒకటేనా..? ధరల పెంపుతో మద్యం వినియోగాన్ని తగ్గించాలనేది మా ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వ్యవస్థను నడిపిస్తున్నాం. అందులో తప్పేముంది..? ఇక, మద్యం నాణ్యత గురించి కూడా ఆయన చెబుతున్నాడు. అది నాసిరకపు మద్యం అని చంద్రబాబు తాగి చూశాడా..? ఆయనకు మద్యం తాగే అలవాటు లేదనుకుంటాను. మరి, ఆయనేదో మద్యం తాగడంలో ఎక్స్పర్ట్గా మాట్లాడుతాడే..? లేదంటే, ఏబీఎన్ లిక్కర్ టెస్టింగ్ ల్యాబ్లో పరీక్షించారా..? మీకు చేతనైన లేబొరేటరీకి పంపి అందులో ఉండాల్సిన ఏబీసీడీలు ఉన్నాయో.. లేవో తెలుసుకోండి. అంతేగానీ, వ్యసనపరుల బలహీనతలను ఆసరాగా చేసుకుని రాజకీయం నడుపుదామని అనుకోవడం ప్రతిపక్షాలకు మంచిది కాదు
Related News by category
-
ఆ మారణహోమం చల్లా వ్యూహం
ప్రజల ధన..మాన..ప్రాణాలంటే పచ్చమూకలకు లెక్కలేదు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేసే పోలీసులంటే గౌరవం లేదు. ప్రశాంత పుంగనూరును వల్లకాడుగా మార్చేయాలి. ప్రభుత్వంపై బురదజల్లాలి. ఇదే లక్ష్యంతో గత ఏడాది ఆగస్టు 2వ తేదీన అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి.. ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి కుట్రకు తెగబడ్డారు. చంద్రబాబు పర్యటనలో అల్లర్లు సృష్టించేందుకు పథకం రచించారు. పోలీసుల ఉసురు తీయడమే లక్ష్యంగా దాడులకు ప్లాన్ వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నింద మోపేందుకు దారుణ మారణహోమానికి తెరతీశారు. అప్పటి ఘటనపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులే లోగుట్టు తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు.పుంగనూరు: జిల్లాలోని పుంగనూరులో గత ఏడాది ఆగస్టు 4వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో మారణహోమం సృష్టించేందుకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. కనీసం ఇద్దరు పోలీసులనైనా చంపాలని దుర్మార్గపు ఆలోచన చేశారు. బాబు పర్యటనకు రెండు రోజుల ముందే ఈ ప్లాన్ రూపొందించారు. పోలీసులపై దాడులకు తెగబడి అల్లర్లు సృష్టించిన ఘటనలో అప్పటి టీడీపీ పుంగనూరు ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి గత ఏడాది ఆగస్టు 2వ తేదీన రొంపిచెర్లలో పార్టీ ప్రధాన వ్యక్తులతో రూపొందించిన పథకాన్ని ఆయన వ్యక్తిగత కార్యదర్శి గోవర్దన్రెడ్డి పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పాడు. ఇది విన్న పోలీసులు కేవలం ఉనికిని కాపాడుకునేందుకు ఇలాంటి క్షుద్ర రాజకీయాలకు పాల్పడతారా అని షాక్కు గురయ్యారు.ప్లాన్– బీ.. ప్టాన్– ఏ అమలుకాని పక్షంలో ప్లాన్–బీకి సైతం పచ్చ పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పోలీసులు చనిపోకపోయినా, ఫైర్ ఓపెన్ చేయకపోయినా ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులు మొత్తం ఒక్కసారిగా పుంగనూరు పట్టణంలోకి చొరబడాలి. ఎక్కడికక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫెక్సీలు చింపడం, పెట్రోలు పోసి నిప్పంటించడం చేయాలి. దీనిపై వెంటనే వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతిస్పందిస్తాయి. ఈ క్రమంలో చెలరేగే అల్లర్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒకరిద్దరిని మట్టుబెడితే.. వాళ్ల చేసే దాడుల్లో టీడీపీ కార్యకర్తలు సైతం చనిపోతారు. ఇది జరిగినా కూడా నెపం ప్రభుత్వంపై నెట్టేసి, శవ రాజకీయంతో సర్కారును పడగొట్టవచ్చని రెండో ప్లాన్ను సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రం మొత్తం ఈ ఘటనలతో హోరెత్తిపోతుందని, అదే కారణంగా శాంతి భద్రతల వైఫల్యాన్ని ఎండగట్టాలని అనుకున్నారు. అయితే ఈ రెండు ప్లాన్ల గురించి టీడీపీలోని ప్రధాన వ్యక్తులకు తప్ప, పార్టీ కార్యకర్తల్లో ఒక్కరికి కూడా తెలియడానికి వీల్లేదంటూ కట్టడి చేశారు. ఎక్కడా కూడా ఈ ప్లాన్ల గురించి ఎవరూ మాట్లాడకుండా అత్యంత గోప్యత పాటించారు. ఈ అల్లర్లకు పుంగనూరు నుంచి కాకుండా మదనపల్లె, ములకలచెరువు, సదుం, సోమల మండలాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ప్లాన్– ఏ.. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జనాదరణ పెరిగిపోతుండడంతో చల్లా బాబు రగిలిపోయారు. ఇదే పుంగనూరులో పెద్దిరెడ్డిని జీరో చేయాలని, అదే సమయంలో రాష్ట్రం మొత్తం పుంగనూరువైపు చూసేలా మారణహోమం సృష్టించాలని సంకల్పించుకున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటన ర్యూట్ మ్యాప్లో పుంగనూరును చేర్చేందుకు పార్టీ శ్రేణులు పట్టుపట్టాలని నిర్ణయించారు. పోలీసులు దీనికి కచ్చితంగా అంగీకరించరని, ఇదే అదనుగా దాడులకు పాల్పడాలని నేతలు, కార్యకర్తలకు చల్లా బాబు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా అప్పటికే కృష్ణదేవరాయ కూడలి వద్ద సిద్ధం చేసుకున్న రాళ్లు, మద్యం బాటిళ్లు, బీరు సీసాలు, బాంబులను పోలీసులను లక్ష్యంగా చేసుకుని విసరాలి. మొత్తం 30 నిముషాల పాటు ఈ రాళ్ల దాడి చేయడానికి వస్తువులను ఉంచారు. తొలి మూడు నిముషాల్లో చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరితే పోలీసులు తేలిగ్గా తీసుకుంటారు. అనంతరం పోలీసుల ఊహకు అందకుండా రాళ్లు, బాంబులు, మద్యం బాటిళ్లతో పది నిముషాలు దాడులు చేయాలని, ఇందులో ఒకరిద్దరు పోలీసులు చనిపోయినా పర్లేదని ఆదేశించారు. ఇదే కనుక జరిగితే వెంటనే పోలీసులు కాల్పులు ఓపెన్ చేస్తారు. ఈ కాల్పుల్లో ఎటులేదన్నా 30 మంది వరకు టీడీపీ కార్యకర్తలు మరణిస్తారు. దీంతో దేశం మొత్తం పుంగనూరు వైపు చూస్తుందని, దీంతో ప్రభుత్వాన్ని కూల్చేసి, సానుభూతి పేరిట చంద్రబాబు నాయుడును సీఎం కుర్చీ ఎక్కించవచ్చనే భారీ పన్నాగం పన్నారు.ఇలాంటి వ్యక్తికి టికెట్టా? స్వార్థ రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాటే చల్లా రామచంద్రారెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై పుంగనూరు వాసులు మండిపడుతున్నారు. ఇలాంటి ఆలోచనా విధానమున్న వ్యక్తిని రాజకీయాల్లో ప్రోత్సహించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ప్లాన్ ఇలా.. టీడీపీ నేతలు రూపొందించిన మారణహోమం ఉచ్చులో పోలీసులు చిక్కుకునే ఘటన దాదాపు అమలైపోతుందని ఆ పార్టీ నేతలు భావించారు. దీనికి తోడు అల్లర్ల సమయంలో అక్కడ బందోబస్తులో ఉన్న ఓ పోలీసు అధికారి వెంటనే అప్పటి ఎస్పీ రిషాంత్రెడ్డికి ఫోన్ చేశారు. పోలీసులు రక్తమోడుతుండడం చూసిన ఆ అధికారి చలించిపోయి. గద్గద స్వరంలో ఎస్పీతో మాట్లాడుతూ.. ‘సర్, పరిస్థితి చేయి దాటిపోతోంది. డీఎస్పీల తలలు పగిలిపోతున్నాయి. సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఇక్కడ ఆర్తనాదాలు చేస్తున్నారు. మనం ఫైర్ ఓపెన్ చేయాలి. వెంటనే మీరు కలెక్టర్తో మాట్లాడి ఫైరింగ్కు ఆర్డర్ ఇవ్వండి ప్లీజ్. లేకుంటే మనవాళ్లు చనిపోతారు..’ అంటూ బతిమిలాడారు. అక్కడ ఏం జరుగుతోందని ఎస్పీ ఆరా తీశారు. సంయమనంతో ఆలోచించి పోలీసులు 300 మీటర్లు వెనక్కు వచ్చేయాలని ఆదేశించారు. దీంతో టీడీపీ శ్రేణులు రాళ్లు, మద్యం బాటిళ్లు నిల్వ ఉన్న ప్రాంతం నుంచి దూరమవుతారని చెప్పారు. ఇదే జరిగితే పోలీసులకు దగ్గరగా వచ్చిన టీడీపీ శ్రేణులను చెదరగొట్టడానికి స్వల్ప లాఠీచార్జ్, బాష్ప వాయు ప్రయోగించాలని సూచించారు. తాను కూడా వెంటనే పుంగనూరు వచ్చేస్తానని, అప్పటి వరకు ఒక్క బుల్లెట్ కూడా తుపాకీ నుంచి బయటకు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎస్పీ ఆదేశాలను అమలు చేసిన పోలీసులు, అనుకున్నట్టుగానే రక్తం కారుతున్నా, అల్లరి మూకల్ని దగ్గరకు రప్పించి లాఠీలతో చెదరగొట్టారు. దీంతో టీడీపీ నేతల కుతంత్రాలు, కుట్రలు పటా పంచలైపోయాయి. ‘చల్లా’ చరిత్ర నేరమయమే! టీడీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు చరిత్రంతా నేరమయమే. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఇతనిపై దాడులు, హత్యయత్నాలు చీటింగ్ తదితర నేరాలపై పోలీసులు 19 కేసులు నమోదు చేశారు. ఇందులో గత ఏడాది ఆగస్టు 4న పుంగనూరులో జరిగిన అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడుగా 7 కేసులు నమోదయ్యాయి. అలాగే సోమల, కల్లూరు, రొంపిచెర్ల, చౌడేపల్లె, ములకలచెరువు, ముదివేడు పోలీస్స్టేషన్లతో పాటు తెలంగాణలోని కూకటిపల్లె పోలీస్స్టేషన్లో కేసులు ఉన్నట్లు చల్లారామచంద్రారెడ్డి స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.– చల్లా రామచంద్రారెడ్డి, టీడీడీ ఎమ్మెల్యే అభ్యరి్థ, పుంగనూరు -
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ
తిరుమల: శ్రీవారిలో భక్తుల రద్దీ ఉంది. క్యూ కాంప్లెక్స్లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న(సోమవారం) 77,673 మంది స్వామివారిని దర్శించుకున్నా రు. 30,607 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.10 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా.. టికెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
కబ్జాల కందికుంట
కదిరి: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేరు వినగానే కదిరి నియోజకవర్గ ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆయన కన్ను పడితే విలువైన స్థలాలు, పొలాలు కబ్జా కావాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. బాధితుల్లో ఎంతోమంది ముస్లింలు, ఇతర సామాజిక వర్గం వారు ఉన్నారు. కబ్జాలను ఎవరైనా ప్రశ్నిస్తే అనుచరులతో దాడులు, దౌర్జన్యాలు చేయించడం ఆయన నైజంగా ఉంది. ప్రజాకంఠకుడిగా ఉన్న ఈయనకే ప్రతి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మీడియా ముందు మాత్రం కందికుంట నీతి సూక్తులు చెబుతుండడం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు.బొరుగులమ్మి సంపాదించిన స్థలం.. కదిరి పట్టణంలోని జామియా మసీదు వీధికి చెందిన పి.ఖాజామోద్దీన్ అలియాస్ బొరుగుల ఖాజా కొన్నేళ్ల క్రితం ఊరూరా తిరిగి బొరుగులు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో కదిరి–హిందూపురం రోడ్లో అప్పట్లో సర్వే నంబరు 70/3–3లో 4.50 ఎకరాల పొలం కొన్నాడు. కుటుంబ అవసరాల కోసం అందులో 1.50 ఎకరాలు అమ్మేయగా.. మూడెకరాలు అలానే ఉంది. ఖాజామోద్దీన్కు ఐదుగురు సంతానం. ఆయన మరణానంతరం ఆ పొలాన్ని కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా సాగుచేస్తూ వచ్చారు. ఆడ పిల్లలందరూ పెళ్లీడుకు రావడంతో వారికి పెళ్లి చేసేందుకు ఆ మూడెకరాల భూమిని అమ్మాలని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.డబ్బు చెల్లించకుండానే ఇతరులకు రిజిస్ట్రేషన్ఆ భూమిని అమ్ముతారనే విషయం తన అనుచరుల ద్వారా కందికుంటకు తెలిసింది. వెంటనే వారిని పిలిపించి సెంటు రూ.80 వేల చొప్పున బేరం కుదుర్చుకొని వెంటనే రూ.లక్ష అడ్వాన్స్గా ఇచ్చారు. తర్వాత ఆ మిగిలిన డబ్బు ఇచ్చి భూమి రిజి్రస్టేషన్ చేయించుకోండని ఖాజామోద్దీన్ కుటుంబ సభ్యులు కందికుంట ఇంటి దగ్గర వేచి ఉండటం దినచర్యగా మారింది. కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ‘ఆ భూమితో మీకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ భూమి మాది. ఇదిగో మా బంధువుల పేరు మీద ఆ భూమికి సంబంధించి కదిరి రెవెన్యూ వారు మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకం’ అంటూ కందికుంట తెలపడంతో వారికి గుండె ఆగినంత పనైంది. ప్రశ్నించే ధైర్యం లేక, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఇంటి దారి పట్టక తప్పలేదు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.20 కోట్లు చేస్తుంది.బాధిత యువకుడిపై హత్యాయత్నం ఖాజామోద్దీన్ మనవడు అమీర్ఖాన్ 2018 జూలై 14న జేసీబీని తీసుకెళ్లి పొలం చదును చేయిస్తున్నాడు. ఈ విషయం కందికుంటకు తెలిసి వెంటనే తన అనుచరులను అక్కడికి పంపి ఆ యువకుడిపై రాళ్ల దాడి చేయించాడు. గుండెలపై బండ రాళ్లతో కొట్టి చంపడానికి కూడా ప్రయత్నించారు. ఈలోగా వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఏడుస్తుంటే జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఆ స్థలం వైపు బాధితులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు. కందికుంట మాత్రం ఆ స్థలం తమదేనని బుకాయించడంతో పాటు మీడియా ముందు తాను సచీ్చలుడినంటూ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు.చిత్తుగా ఓడించండి అమాయక ప్రజల భూమిని ఆక్రమించి, దానికి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి అందులోకి ఇతరులెవ్వరూ ప్రవేశించకుండా కందికుంట ప్రస్తుతం దానికి పెద్ద గేట్ కూడా ఏర్పాటు చేయించాడు. ఆ స్థలం యజమానులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులే కాకుండా ఆ దారిగుండా వెళ్లే ప్రతి ఒక్కరూ కందికుంటకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి చంద్రబాబు ప్రతిసారీ ఎందుకు టికెట్ ఇస్తున్నాడో అర్థం కావడం లేదని జనం తప్పుబడుతున్నారు. పేదల స్థలాలు కబ్జా చేసే కందికుంటను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అన్నీ అపోహలే
సాక్షి, అమరావతి: ల్యాండ్టైట్లింగ్ చట్టంపై అవగాహన లేకుండా కొందరు దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం మండిపడింది. రెవెన్యూ, న్యాయపరమైన అంశాలు తెలియనివారు దీనిపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తింది. ప్రభుత్వం భూములు లాక్కుంటుందనేది శుద్ధ అబద్ధమని తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో సీఎం సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజేయ కల్లం, భూచట్టాల నిపుణుడు సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అజేయ కల్లం మాట్లాడుతూ ఈ చట్టంపై హైకోర్టు స్టే ఇచ్చిందని, ఇక ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భూముల రీ సర్వే పూర్తయ్యాక టైట్లింగ్ మొదలవుతుందని, అప్పుడే డిక్లరేషన్ జరుగుతుందన్నారు. తీసుకువచ్చే మార్పులు చేర్పుల గురించి కోర్టుకు తెలిపాక, అందరితో సంప్రదించాక ఈ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. టైట్లింగ్ యాక్ట్, రీ సర్వే, ఇ–స్టాంపింగ్ విధానాలు అద్భుతమైన సంస్కరణలని కొనియాడారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే వాటిని ఎలాగైనా అడ్డుకోవాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ల్యాండ్ టైటిల్స్ కోర్టులు ఇవ్వాలి తప్ప రెవెన్యూ శాఖకు ఏం పని అంటున్నారని, దీనిపై నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదన్నారు. ఆర్ఓఆర్ లేక ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేసే అధికారం కేవలం కార్వనిర్వాహక వ్యవస్థకే ఉంటుందన్నారు. కోర్టుల్లో కేవలం వివాదాల పరిష్కారానికి, వాటిపై అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. భూ రికార్డుల వ్యవస్థను భ్రష్టు పట్టించినవారే ఇప్పుడు వాటిని పరిష్కరించేందుకు తీసుకువస్తున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 1983 నుంచే భూ రికార్డుల వ్యవస్థ భ్రష్టు పట్టడం మొదలైందన్నారు. ప్రతి సంవత్సరం జమాబందీ, అజమాయిషీ సర్వేలు చేస్తూ కచ్చితమైన రికార్డుల వ్యవస్థగా ఉన్న కరణం వ్యవస్థను ప్రత్యామ్నాయం లేకుండా ఒక్కసారిగా రద్దు చేశారని విమర్శించారు. దీంతో పదేళ్లపాటు క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు తయారు చేసేవారు లేకుండాపోయారన్నారు. దీనివల్లే వివాదాలు పెరిగాయని, నకిలీలు, రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నారు. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసి మంచి వ్యవస్థను తీసుకువçస్తుంటే దానిపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.12కి పైగా రాష్ట్రాల్లో ఇ–స్టాంపింగ్ వ్యవస్థ తెల్గీ స్టాంపుల కుంభకోణం తర్వాత కేంద్ర ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అజేయ కల్లం గుర్తు చేశారు. ఇప్పుడున్న స్టాంప్ పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లతో ఆ సంస్థ ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తెచ్చిందన్నారు. మహారాష్ట్రలో 2015లో ఈ విధానాన్ని తొలిసారి అమలు చేశారని, అది విజయవంతమయ్యాక ఇప్పుడు 12కిపైగా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. 2016లో మన రాష్ట్రంలోనూ తాను రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్ను ఆహ్వానించి పైలెట్ ప్రాజెక్టు చేయమన్నానని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. దాని ట్రయల్స్ కోసం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 135 డాక్యుమెంట్లు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ మెమో ఇస్తే.. దానికి, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి లింకు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇ–స్టాంపులు జిరాక్స్ పేపర్లు కావన్నారు. అందులో నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉంటాయని తెలిపారు.నల్లచట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరం: భూచట్టాల నిపుణుడు సునీల్కుమార్భూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సునీల్కుమార్ మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని నల్ల చట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ చట్టం ద్వారా భూములు లాగేసుకుంటారని, కోర్టులకు అధికారాలు ఉండవని, అన్ని అధికారాలు తీసుకెళ్లి టైటిల్ రిజిస్టర్ అధికారికి ఇస్తున్నారని, ఆయన ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారనే ప్రచారాలు పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలు జరగకపోతే రాష్ట్రం మళ్లీ 50 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. ఉన్న భూములకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి హక్కులను కాపాడుతుందే తప్ప భూములను లాక్కునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఉన్న రికార్డుల ఆధారంగా ప్రభుత్వం ఒక రిజిస్టర్ తయారు చేస్తుందని, దాన్ని ప్రజలందరికీ అందుబాటులో పెడతారన్నారు. దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. రీ సర్వే ద్వారా తయారయ్యే రికార్డును టైటిల్ రిజిస్టరింగ్ చట్టం కింద ప్రకటిస్తారని, అది ఆన్లైన్లో అందరికీ అందబాటులో ఉంటుందని వివరించారు. కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదనేది తప్పని, ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తున్న కేసులు అలాగే నడుస్తాయన్నారు. అలాగే భూములు అమ్మాలన్నా, దానం చేయాలన్నా టైటిల్ రిజిస్ట్రార్ అనుమతి కావాలనేది అపోహేనని తేల్చిచెప్పారు. కొత్త చట్టం తహశీల్దార్కి, సబ్ రిజిస్ట్రార్కి ఉన్న అధికారాలను ఒక చోటకు చేరుస్తుందన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ జరిగి రికార్డులోనూ మార్పు కూడా జరిగిపోతోందన్నారు. భూముల రీ సర్వే పూర్తయితే భూములకు సంబంధించి 80 రకాల సమస్యల్లో చాలావరకు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏబీవీ.. ఎనీటైం బాబు వెంటే
సాక్షి, అమరావతి: ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి. ‘ఎనీటైమ్ బాబు వెంటే’ (ఏబీవీ)గా పేరు తెచ్చుకున్న ఆయన ఐపీఎస్ అధికారిగా కంటే.. టీపీఎస్ (టీడీపీ పొలిటికల్ సర్విస్) అధికారిగా పనిచేయడానికే ఎక్కడలేని ఆసక్తి చూపుతారు. చంద్రబాబు సీఎంగా ఉండగా 2014–19 వరకు ఆయన అడ్డగోలుగా చెలరేగిపోయారు. ఇష్టారాజ్యంగా అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. బంధువులు, బినామీల పేరిట అమరావతిలో భూదోపిడీకీ తెగబడ్డారు.ప్రభుత్వ అధికారిక విధుల కంటే టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారు. ముఖ్యంగా.. 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మందిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరి్పంచడంలో ఆయనదే కీలకపాత్ర. కేంద్ర భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ డేటాచోరీకి పాల్పడటం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. కొన్నేళ్లుగా సస్పెన్షన్లో ఉన్న ఆ అధికారి ప్రస్తుతం ఎన్నికల్లో మరోసారి టీడీపీ రాజకీయ లబ్ధికోసం సివిల్ సర్విస్ నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తున్నారు. తెలుగుదేశం తరఫున రెబల్స్గా బరిలో ఉన్న వారిని బెదిరిస్తూ.. టీడీపీ ఏకపక్ష వైఖరితో విసిగిపోయి కినుక వహించిన జనసేన, బీజేపీ నేతల భరతంపడుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా టీడీపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆ అధికారి బరితెగింపు ఎలాగుందంటే.. టీడీపీ రెబల్స్కు బెదిరింపులు.. పార్టీ కోసం పనిచేసిన నేతలకు కాకుండా లోకేశ్కు ముడుపులు చెల్లించుకున్న బడా బాబులకే ఈ ఎన్నికల్లో చంద్రబాబు టికెట్లు కేటాయించడంతో ఆ పారీ్టలో అసమ్మతి భగ్గుమంది. దాంతో పలువురు టీడీపీ రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరోవైపు.. బీజేపీ, జనసేన పారీ్టలకు టీడీపీ అరకొరగా సీట్లు కేటాయించడంపట్ల ఆ రెండు పారీ్టల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీచేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండిపోయారు. ఈ పరిణామాలు టీడీపీ విజయావకాశాలు దెబ్బతీయడం ఖాయమని స్పష్టమైంది. దీంతో బెంబేలెత్తిన చంద్రబాబు తన నమ్మినబంటు అయిన ఆ వివాదాస్పద ఐపీఎస్ అధికారిని రంగంలోకి దించారు. ఇంకేముంది.. ఆ అధికారి టీడీపీ రెబల్స్గా బరిలో ఉన్న నేతలే లక్ష్యంగా బెదిరింపుల పర్వానికి దిగారు. ఉదా.. ∗ నూజివీడులో టీడీపీ రెబల్ అభ్యరి్థగా నామినేషన్ వేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తాజాగా వెనక్కి తగ్గడం వెనుక ఆ అధికారి బెదిరింపులే కారణం. సదరు అధికారి కూడా నూజివీడు నియోజకవర్గానికే చెందిన వ్యక్తే. ఈయన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో ఇటీవల రెండు మూడుసార్లు భేటీ అయ్యారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ముద్దరబోయిన తన నామినేషన్ను వెనక్కి తీసుకోవడం గమనార్హం. ∗ అలాగే, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీచేసి తీరుతానని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ ప్రకటించారు. ఆ మేరకు ఆ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ర్యాలీలు కూడా నిర్వహించి చంద్రబాబు, అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఆయనకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు వచి్చంది. చంద్రబాబు పిలిపించారని భావించిన రమణకు విజయవాడ వచ్చాక ఝలక్ తగిలింది.టీడీపీ తరఫున ఆ ఐపీఎస్ అధికారే రమణతో మాట్లాడినట్లు సమాచారం. నిజానికి.. 2014లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కలమట వెంకట రమణను అప్పట్లో ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరేలా వ్యవహారం నడిపింది ఈ అధికారే. అందుకే ఇప్పుడు కూడా ఆయనకే చంద్రబాబు బాధ్యత అప్పగించారు. రెబల్గా పోటీ చేయకూడదని, పోటీచేస్తే ఆయన ఆరి్థక మూలాలు దెబ్బతీస్తామని.. గతంలో ఎక్కడెక్కడ నల్లధనాన్ని పెట్టుబడిగా పెట్టిందీ ఆధారాలతో బయటకుతీస్తానని స్పష్టంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కలమట వెంకటరమణ పోటీచేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ∗ జగ్గయ్యపేట, గన్నవరం, జగ్గంపేట, ఎస్.కోట, విజయనగరం తదితర నియోజకవర్గాల్లో బరిలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన రెబల్ అభ్యర్థుల వద్దకూ తన అనుచరులను పంపించి బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన మనుషులను వారి వద్దకు పంపించి మరీ వారి్నంగులు ఇప్పిస్తున్నారని సమాచారం. ఆ అధికారి తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ∗ ఇక విజయవాడ పశి్చమ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి అనుకూలంగా ఆ అధికారి రంగంలోకి దిగారు. టీడీపీ అసంతృప్త నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ను తనదైన శైలిలో బెదిరించినట్లు సమాచారం. 2014లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీలో చేరడం వెనుక ఈ వివాదాస్పద అధికారే క్రియాశీలక పాత్ర పోషించారు. సుజనాచౌదరికి అనుకూలంగా ముస్లింలతో సమావేశం నిర్వహించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు ముస్లింలతో ఓ సమావేశం నిర్వహించి సుజనాకు ఓటు వేయాలని చెప్పాల్సి వచి్చందని జలీల్ఖాన్ సన్నిహితులే చెబుతున్నారు. కానీ, సుజనాచౌదరికి ముస్లింలు ఓటు వేసేదేలేదని కూడా వారు స్పష్టంచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నుంచి వచి్చన సుజనాకు టికెట్ కేటాయించడం సంప్రదాయ బీజేపీవాదులకు తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీంతో ఆ నేతలు ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. దీన్ని గుర్తించిన ఆ అధికారి అసంతృప్త బీజేపీ నేతలతో తన స్టైల్లో మాట్లాడారు. వన్టౌన్లో దశాబ్దాలుగా వారు నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలను దెబ్బతీస్తామని హెచ్చరించారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
'కల్కి' కాపీ సినిమా కాదు.. క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement