ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగి వీరంగం | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగి వీరంగం

Published Thu, Aug 21 2014 9:30 AM

Medical employee halchal in government hospital

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం మత్తులో ఎంఎన్వో గురువారం వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చిన అక్సిజన్ తొలగించాడు. దాంతో సదరు రోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా మరింది. దీంతో బంధువులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. రోగి బంధువులు ఎంఎన్వోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆసుపత్రి గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఎంఎన్వోను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆసుపత్రి సూపరింటెండెట్ను డిమాండ్ చేశారు.  

Advertisement
Advertisement