రిమ్స్‌లో వైద్యం అందక పసికందు మృతి | Sakshi
Sakshi News home page

రిమ్స్‌లో వైద్యం అందక పసికందు మృతి

Published Sun, Oct 11 2015 4:39 PM

medical negligence leads toddler dies in ysr district

కడప అర్బన్: కడప పట్ణణంలోని ప్రభుత్వ ఆస్పత్రి రిమ్స్‌లో వైద్యం అందక రెండు రోజుల వయసున్న మగ శిశువు ఆదివారం మృతి చెందాడు. బాధితుల కథనం ప్రకారం.. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం అల్లాడివీధికి చెందిన నాగరత్న శుక్రవారం రిమ్స్‌లో మగ శిశువును ప్రసవించింది. అయితే, ఆదివారం మధ్యాహ్నం చిన్నారిని తల్లి నుంచి వేరు చేసి ఎస్‌ఎంసీ వార్డుకు తరలించారు. కానీ, అక్కడ వైద్యులు ఎవరూ లేరు. దీంతో వైద్యం అందక ఆ చిన్నారి మృతి చెందాడు. దీంతో నాగరత్న బంధువులు న్యాయం కోరుతూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.

Advertisement
Advertisement