అసెంబ్లీలో మంత్రి అఖిలప్రియకు చురకలు | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో మంత్రి అఖిలప్రియకు చురకలు

Published Wed, Nov 29 2017 11:52 AM

minister akhila priya speaks on telugu language in ap assembly - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలలో బుధవారం తెలుగు భాషపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అఖిల ప్రియకు ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర్‌ శివాజీ చురకలంటించారు. చర్చ సందర్భంగా ఇకపై అన్ని శాఖలు తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అఖిలప్రియ తెలిపారు.

అయితే ఆమె తెలుగు భాష గురించి చెబుతూ ఆంగ్ల పదాలు వాడారు. దీనిపై శివాజీ స్పందిస్తూ తెలుగు మాట్లాడాలని చెప్పే మంత్రి అఖిల ప్రియే సభలో ఆంగ్లంలో చెబుతున్నారని తప్పుబట్టారు. ముందు మంత్రులు అసెంబ్లీ లో కూడా ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో మాట్లాడితే బాగుంటుందని ఆయన సూచించారు.

Advertisement
Advertisement