తుని ఘటనలో టీడీపీ వారూ ఉన్నారు | Sakshi
Sakshi News home page

తుని ఘటనలో టీడీపీ వారూ ఉన్నారు

Published Wed, Feb 3 2016 2:50 AM

తుని ఘటనలో టీడీపీ వారూ ఉన్నారు - Sakshi

మంత్రి నారాయణ వెల్లడి
విజయవాడ(పటమట): తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగిన కాపు ఐక్య గర్జన సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో టీడీపీకి సంబంధించిన వారి పాత్ర కూడా ఉందని తెలిసినట్లు మంత్రి పి.నారాయణ చెప్పారు. పోలీసుల నివేదిక ఆధారంగా వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం ఏ విషయమై దీక్షకు కూర్చుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీవో 30 అమల్లోనే ఉందని మంత్రి చెప్పారు. 9 నెలల్లో తాము వేసిన కమిషన్ నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. అలాగే రాజధాని రైతులకు న్యాయం చేయడం లేదంటూ సీఎంకు లేఖ రాసిన చిరంజీవి అన్నీ తెలుసుకొని మాట్లాడాలన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement