కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెన,
రెండో రోడ్డు వంతెన నిర్మాణ పనుల పరిశీలన
పనులను వేగిరపర్చాలని మంత్రి శిద్ధా రాఘవరావు ఆదేశం
కొవ్వూరు: కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెన, కొవ్వూరు-రాజమండ్రి రెండో రోడ్డు వంతెన నిర్మాణ పనుల జాప్యంపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్ధా రాఘరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రెండు వారధుల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులు పురోగతి లేకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. రోడ్డు కం రైలు వంతెనపై పుట్పాత్లు, రైలింగ్లు సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ముందుగా తూర్పుగోదావరిలోని పలు రోడ్ల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. బ్రిడ్జి మరమ్మతులు నెలాఖరు నాటికి పూర్తి చేయూలని ఆదేశించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.850 కోట్ల పనులు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 65 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. రోడ్డు కం రైలు వంతెన మరమ్మతులు నిర్దేశిచిన సమ యం కంటే నెలరోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. జాయింట్ల వద్ద వేసే ప్లాస్టిక్ షీట్లు సకాలంలో లభించకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు పుష్కర పనులను పరిశీలించినట్టు మంత్రి తెలిపారు. అనంతరం రెండో రోడ్డు వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు.
అక్కడా పనులు అసంపూర్తిగా ఉండట ంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేనెల మొదటివారం లోపు పనులు పూర్తికావాలని ఆదేశించారు. పనులను వేగిరపర్చకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆర్అండ్బీ ఎస్ఈ మూర్తి, కొవ్వూరు ఆర్అండ్బీ ఈఈ ఎస్.శ్రీనివాసులు, డీఈఈ ఎ.శ్రీకాంత్, అధికారులు మంత్రి వెంట ఉన్నారు.
వారధి పనులపై మంత్రి ఆగ్రహం
Published Mon, May 18 2015 1:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement