వక్ఫ్బోర్డు అధికారులను బెదిరించిన ఎమ్మెల్యే జలీల్ఖాన్
సాక్షి, అమరావతి: వక్ఫ్బోర్డుకు కాబోయే చైర్మన్ను నేనే.. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేకు ఎంత మామూళ్లు ఇచ్చారు.. ఆదాయం, ఖర్చు వివరాలు చెప్పండి అంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వక్ఫ్బోర్డు అధికారులను బెదిరించారు. అంతేకాకుండా రాష్ట్రంలో తాను సూచించిన వారిని ముతవల్లీలుగా గెలిపించాలని, లేకుంటే అందుకు సహకరించని అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించినట్లు తెలిసింది. వక్ఫ్బోర్డుకు ఎలాంటి సంబంధంలేని ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడటం ఏమిటని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతోనే తేల్చుకుంటామని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ల సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి హాజరవుతానని ఎమ్మెల్యే జలీల్ఖాన్ వక్ఫ్బోర్డు అధికారులకు ముందుగా సమాచారం ఇచ్చారు. అయితే వక్ఫ్బోర్డులో ఏ హోదా లేకుండా సమావేశానికి హాజరవడానికి వీలులేదని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. అయితే ఎమ్మెల్యే భోజనాలు ఏర్పాటు చేయడంతో ఇన్స్పెక్టర్లతోపాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బెదిరింపులకు దిగడంతో అధికారులు ఖంగుతిన్నారు. అంతేకాకుండా కర్నూలు, విజయవాడలకు చెందిన ఖాజా, ఇంతియాజ్ అనే వ్యక్తులను పరిచయం చేస్తూ ఆయా ప్రాంతాల్లో వీరు ముతవల్లీలుగా పోటీ చేయనున్నారని, వీరిని గెలిపించే బాధ్యత మీదే అంటూ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులకు సూచించారు. అందుకు సహకరించని వారిని సస్పెండ్ చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా వక్ఫ్బోర్డులో ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇద్దరు ముతవల్లీలు, ఒక న్యాయవాది ఇతరులను సభ్యులుగా నియమించాల్సి ఉంటుంది. అయితే టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరూ లేకపోవడంతో వైఎస్సార్ సీపీ నుంచి వలసలు వచ్చిన ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు వక్ఫ్బోర్డు ఏర్పాటు చేయకుండా నాన్చుతూ వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మామూళ్ల వివరాలివ్వండి: ఎమ్మెల్యే
Published Thu, Aug 10 2017 8:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నూతన కార్యవర్గం ఎన్నిక
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
డెంగీతో ఒకరి మృతి
వలస కార్మికులకు అండగా..
ఆర్మూర్లో బైక్ చోరీకి యత్నం
కోనాపూర్లో అగ్ని ప్రమాదం
పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్
చెట్టును ఢీకొని ఒకరి మృతి
విజృంభిస్తున్న ఎండలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement