సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇప్పటికే సొంతపార్టీ నేతల చర్యలతో అభద్రతా భావంతో సతమతమవుతున్నారు. ఇకపై మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఇందుకు బీజేపీలో చేరాలనుకుంటున్న కాంగ్రెస్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజే కారణం. ఆయన బీజేపీలో చేరితే అక్కడ మరో పవర్ సెంటర్ తయారవుతుందని భయపడుతున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా బీజేపీ అగ్రనేతలపై ఒత్తిడికి దిగారు. రాజకీయంగా విభేదిస్తున్న రఘురాజును చేర్చుకుంటే తనకు ఇబ్బంది వస్తుందని పరోక్షంగా తెలిపారు. కానీ కోళ్ల లలితకుమారి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కొన్ని రోజుల పాటు సందిగ్ధంలో పడ్డ బీజేపీ అగ్రనేతలు చివరికి రఘురాజును చేర్చుకోవడానికే మొగ్గుచూపారు. ఎస్కోటలో పార్టీ బలపడాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కుమార్తె శోభా స్వాతి రాణి జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికైన దగ్గరి నుంచి ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అభద్రతా భావంలో పడ్డారు. జెడ్పీ పదవితో నియోజకవర్గంలో హైమావతి పట్టు పెంచుకుంటారని, తనకు పోటీగా తయారవుతారని, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్కు ఎసరొచ్చే అవకాశం ఉందనే భయపడుతున్నట్టు తెలిసింది. శోభా హైమావతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారన్న వాదనలు ఉన్నాయి. ఈ తరుణంలో ఇందుకూరి రఘురాజు రూపంలో మరో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవల్సిన పరిస్థితి ఆమెకు ఏర్పడింది. బీజేపీలో చేరుతానని రఘురాజు ప్రకటించిన రోజు నుంచి ఆమెవర్గీయుల్లో ఆందోళన మొదలైంది.
విశాఖ పార్లమెంట్ పరిధిలోకి ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గం వస్తుందని, రఘరాజు బీజేపీలో చేరితే కంభంపాటి హరిబాబుకు చెందిన ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు తెచ్చి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తమకు సమాంతరంగా ఎదిగిపోతారని ఆమె అనుచరులు భయాందోళన వ్యక్తం చేసినట్టు తెలి సింది. దీంతో కోళ్ల లలితకుమారి అప్రమత్తమై రఘురాజును చేర్చుకోనివ్వద్దని మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు ద్వారా ఎంపీ కంభంపాటి హరిబాబుపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న కా మినేని శ్రీనివాసరావుపై కూడా ఒత్తిళ్లకు దిగినట్టు తెలియవచ్చింది. రఘరాజు బీజేపీలో చేరితే ఆయనతో పాటు ఆయన గురువులుగా ఉన్న కాంగ్రెస్ కీలక నేతలు కూడా చేరవచ్చని అదేజరిగితే భవిష్యత్లో టీడీపీకికూడా ఇబ్బందులొస్తాయం టూ మంత్రులకు చెప్పి తద్వారా బీజేపీపై ఒత్తిడి చేశారని నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ఈ విషయంపై నిర్ణయం తీసుకోని బీజేపీ చివరికి ఒక ఆలోచనకొచ్చింది.
రాష్ట్రంలో పటిష్టమవుదామని వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న బీజేపీ అగ్రనేతలు, వచ్చిన అవకాశాన్ని వదులకోకూడదని, పార్టీ బలోపేతం అయ్యేందుకు దోహదపడే పరి ణామాలను సద్వినియోగం చేసుకోవాలన్న యోచనతో రఘురాజును చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే కేంద్రమంతి వెంకయ్యనాయుడు, తదితర పెద్దల సమక్షంలో చేర్చుకునేందుకు రఘరాజుకు సంకేతాలు ఇచ్చా రు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇక రఘురాజు బీజేపీలో చేరితే నియోజకవర్గంలో తిష్ఠవేయడమే కాకుండా ఎంపీ ల్యాడ్స్, కేంద్రప్రభుత్వ నిధులతో పనులు చేయించి ఎమ్మెల్యేకు పోటీగా తయారయ్యే అవకాశం ఉంది. చెప్పాలంటే మరో పవర్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే శోభా హైమావతి రూపంలో ఒక సవాల్ ఎదుర్కొంటుండగా ఇకపై రఘురాజు ద్వారా మరో సవాల్ ఎదుర్కోవల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
పక్కలో మరో బల్లెం!
Published Fri, Sep 26 2014 1:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement