నవరత్నాలతో నవశకానికి నాంది | Sakshi
Sakshi News home page

నవరత్నాలతో నవశకానికి నాంది

Published Sun, Feb 9 2020 9:53 PM

MLA Malladi Vishnu Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలతో నవశకానికి నాంది పలికారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం నిర్వహించిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ.. రూ.300 కోట్ల అభివృద్ధి పనులతో విజయవాడ రూపురేఖలు మారబోతున్నాయని పేర్కొన్నారు. 2014-19 వరకు విజయవాడకు ఒక రూపాయి కూడా చంద్రబాబు ఖర్చు పెట్టలేదన్నారు. పింఛన్లు, ఆరోగ్య,రేషన్‌ కార్డులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికంగా ఇస్తోందని చెప్పారు. శ్యాచురేషన్‌ పద్ధతిలో దృఢ సంకల్పంతో పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.

సెంట్రల్‌ నియోజకవర్గంలో 24 వేల మందికి అమ్మ ఒడి పథకాన్ని వర్తింపు చేశామని తెలిపారు. 14 పాఠశాలలు నాడు-నేడు కార్యక్రమంతో అభివృద్ధి కాబోతున్నాయన్నారు. టీడీపీ హయాంలో ఇళ్ల పేరుతో 15 వేల మంది దగ్గర డబ్బులు కట్టించుకుని మొహం చాటేశారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదచల్లుడు రాజకీయాలు చంద్రబాబు మానుకోవాలని ఎమ్మెల్యే విష్ణు హితవు పలికారు.
 

Advertisement
Advertisement