- వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజం
- చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారు
- రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారు
పుత్తూరు: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఆమె ఖండించారు. నడిరోడ్డుపై కత్తులు, తుపాకులతో టీడీపీ నాయకులు చెలరేగుతుంటే అణచివేయాల్సిన పోలీసులు వారిని బుజ్జగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. అర్హత లేని వారికి గన్మెన్ సౌకర్యం కల్పించడమే కాకుండా వారిని ప్రతిపక్షాలపైకి, ప్రజలపైకి ఉసిగొల్పి సీఎం చంద్రబాబు నాయుడు రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా టీడీపీ నాయకులకు తుపాకులు, బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రోజా ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో నారాయణరెడ్డి హత్య, ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం వర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఇద్దరు చనిపోయినా ఆ కేసులు ఇంతవరకూ అతీగతీ లేకుండా పోయాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. హత్య, అత్యాచారం కేసుల్లో నిందితులను కాపాడేందుకు 120 జీవోలను జారీ చేసిన చంద్రబాబుకు హైకోర్టు మొట్టికాయలు వేసినా బుద్ధిరాలేదని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ ఫ్యాక్షన్ హత్యలకు జరగడానికి చంద్రబాబు ప్రభుత్వం ఆజ్యం పోస్తోందన్నారు. చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
హత్యా రాజకీయాలకు ప్రభుత్వ ప్రోత్సాహం
Published Fri, Aug 25 2017 3:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement