'ఏపీలోనూ టీడీపీ కుట్రలు' | Sakshi
Sakshi News home page

'ఏపీలోనూ టీడీపీ కుట్రలు'

Published Mon, Jun 22 2015 12:50 PM

'ఏపీలోనూ టీడీపీ కుట్రలు' - Sakshi

ప్రకాశం: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఆయనిక్కడ సోమవారం మాట్లాడుతూ మెజార్టీ లేకపోయినా టీడీపీ అభ్యర్థిని పోటీకి నిలబెడుతోందన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి అట్టా చికవెంకటరెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వక్య్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ సభ్యులు నిజాయితీతో ఉన్నారన్నారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థి గా మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ చేస్తున్నారు.

Advertisement
Advertisement