చిత్తూరు(టౌన్), న్యూస్లైన్: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మోడల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరత తీవ్రంగా ఉంది. 2011 లోనే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా భవనాల నిర్మాణం పూర్తికాకపోవడంతో 2013 విద్యా సంవత్సరంలో 6, 7, 8, ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 16 పాఠశాలలున్నారు. వీటిలో ప్రిన్సిపాల్స్, పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్)లు పూర్తి స్థాయిలో లేరు.
టీజీటీ (టైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించినప్పటికీ వీరిలో కొంత మందిని మాత్రమే నియమించారు. ప్రిన్సిపాల్, పీజీటీ పోస్టుల కోసం అభ్యర్థులు అర్హత పరీక్ష రాసినప్పటికీ కొంతమంది విధుల్లో చేరకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని మోడల్ పాఠశాలల్లో 16 మంది ప్రిన్సిపాల్స్కు ఐదుగురు, 160 మంది పీజీటీలకు 131 మంది, 112 మంది టీజీటీలకు ఐదుగురు మాత్రమే ఉన్నారు.
ఐదు చోట్లే ప్రిన్సిపాళ్లు
విద్యాపరంగా వెనకబడిన మండలాల్లో మోడల్ పాఠశాల లు ఏర్పాటు చేశారు. కేవీబీపురం, కేవీపల్లి, కురబలకోట, పుంగనూరు, ఎర్రావారిపాళెం మండలాల్లోని పాఠశాలల్లో మాత్రమే ప్రిన్సిపాల్స్ ఉన్నారు. మిగిలిన చోట్ల ఎంఈవోలు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. వీరికి మండల స్థాయిలో అనేక పనులు ఉండడంతో మోడల్ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోతున్నారనే విమర్శలున్నాయి. టీజీటీలు హిందీ సబ్జెక్టుకు మాత్రమే కేవీబీపురం, కేవీపల్లి, కలకడ, కు రబలకోట, పుంగనూరు మండలాల్లో ఉన్నారు.
పీజీటీలు ఒక్కో పాఠశాలలో 10 మంది ఉండాల్సి ఉండగా బి.కొత్తకోటలో ఆరుగురు, బెరైడ్డిపల్లెలో తొమ్మిది మంది, గుడిపల్లిలో ఇద్దరు, కలకడలో తొమ్మిది మంది, కుప్పంలో ఏడుగురు, కేవీబీపురంలో తొమ్మిదిమంది, కేవీపల్లిలో తొమ్మిది మంది, కురబలకోటలో ఆరుగురు, పెద్దమండ్యంలో తొమ్మిది మంది, పీటీఎంలో ఐదుగురు, పుంగనూరులో ఏడుగురు, శాంతిపురంలో తొమ్మిది మంది, తంబళ్లపల్లిలో ఐదుగురు, ఎర్రావారిపాళెంలో తొమ్మిది మంది మంది ఉన్నారు.
మో‘డల్’ విద్య
Published Sun, Oct 27 2013 4:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement